బిర్యాని వండి పెట్టిన వదినని చావబాదిన ఆడపడుచు..ప్రాణాలు కోల్పోయిన మహిళ

  • Published By: nagamani ,Published On : December 3, 2020 / 01:02 PM IST
బిర్యాని వండి పెట్టిన వదినని చావబాదిన ఆడపడుచు..ప్రాణాలు కోల్పోయిన మహిళ

Kolkata woman attacked sister in law : బిర్యానీ ఓ మహిళ ప్రాణం తీసింది. బిర్యానీ కోసం కొట్టుకోవటంతో జరిగిన గొడవ కాదు. బిర్యానీ చేసి పెట్టినందుకు జరిగిన గొడవ ఓ ప్రాణం తీసింది. పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో సోమవారం (డిసెంబర్1,2020)న జరిగిన ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.



కోల్‌కతా పోలీసులు తెలిపిన వివారాల ప్రకారం..నగరంలోని డల్హౌసీ ప్రాంతానికి చెందిన ఫాల్గుణి బసు అనే 48ఏళ్ల మహిళ గత సోమవారం ఆడపడుచు కొడుకుకు బిర్యానీ చేసి పెట్టింది. ఘుమఘుమలాడే బిర్యానీ చక్కగా తిన్నాడు. అయితే బిర్యానీ తిన్న కొద్దిసేపటి అతనికి వాంతులు అయ్యాయి.



దీంతో ఆమె ఆడపడుచు 40 ఏళ్ల శర్మిష్ట బసు తన కొడుక్కి కావాలని చద్ది బిర్యానీ పెట్టడం వల్లే వాంతులు అయ్యాయని ఆగ్రహంతో వదిన ఫాల్గుణి మీద ఊగిపోయింది. నానా రభసా చేసింది. అంతటితో ఊరుకోకుండా వదినపై దాడికి దిగి విచక్షణా రహితంగా కొట్టింది.



ఆడపడుచు కొట్టిన దెబ్బలు తాళలేక..శారీరకంగా..మానసికంగా ఒత్తిడికి గురైన ఆమె గట్టిగా ఏడుస్తూ అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. ఈక్రమంలో గుండెపోటు వచ్చి, నేలపై కుప్పకూలిపోయింది. ఆడపడుచు కొట్టే దెబ్బలకు ఫాల్గుణి అరుపులు విని అక్కడికి వచ్చిన భర్త అరిందం బసు (50) నేలపై పడిఉన్న భార్యను వెంటనే బాగజాతిన్ ఆస్పత్రికి తరలించాడు.



ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందిందని తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితురాలు స్క్రిజోఫ్రేనియా అనే మానసిక రుగ్మతతో బాధపడుతోందని, తరుచూ వింతగా ప్రవర్తిస్తోందని..దాంట్లో భాగంగానే వదినపై దాడిచేసిందని కుటుంబసభ్యులు తెలిపారు.



కాగా ఫాల్గుణిని ఆడపడుచు శర్మిష్ట బసు కొడుతున్న సమయంలో ఆమె భర్త అన్షుమాన్..అతని కొడుకు ఇద్దరూ అక్కడే ఉన్నాడనీ..కానీ అడ్డుకోలేనట్లుగా తెలుస్తోంది. శర్మిష్ట కొడుకు ఎక్కువగా జంక్ ఫుడ్ లకు అలవాటు పడి ఓవర్ వెయిట్ గా తయారయ్యాడు.



దీంతో శర్మిష్ట కొడుకు తల్లిని చేయమంటే బిర్యానీ చేయలేదు. దీంతో మేనమామ భార్య దగ్గరకొచ్చి బిర్యానీ కావాలని అడగగా ఫాల్గుణి చేసి పెట్టింది. ఈ విషయం శర్మిష్టకు నచ్చలేదు. నా కొడుకుని అనవసరంగా చెడగొడుతున్నావ్..కావాలనే బిర్యానీ పెట్టి నా కొడుకుకు వాంతులు అయ్యేలా చేశావని దాడిచేసినట్లుగా తెలుస్తోంది.