Lalu Prasad Yadav: హాస్పిటల్‌లో లాలూ.. ఫోన్ చేసి పరామర్శించిన మోదీ

ఆర్జేడీ సుప్రీం బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం గురించి ప్రధాని మోదీ స్వయంగా ఫోన్ చేసి వాకబు చేశారు. ఇంటి దగ్గర పడిపోయిన లాలూ కుడి భుజానికి గాయం కావడంతో ఆదివారం పాట్నాలోని హాస్పిటల్ లో చికిత్స నిమిత్తం జాయిన్ చేశారు.

Lalu Prasad Yadav: హాస్పిటల్‌లో లాలూ.. ఫోన్ చేసి పరామర్శించిన మోదీ

Lalu Prasad

 

 

Lalu Prasad Yadav: ఆర్జేడీ సుప్రీం బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం గురించి ప్రధాని మోదీ స్వయంగా ఫోన్ చేసి వాకబు చేశారు. ఇంటి దగ్గర పడిపోయిన లాలూ కుడి భుజానికి గాయం కావడంతో ఆదివారం పాట్నాలోని హాస్పిటల్ లో చికిత్స నిమిత్తం జాయిన్ చేశారు.

చికిత్స గురించి, లాలూ కోలుకుంటున్న పరిస్థితి గురించి మోదీనే స్వయంగా లాలూ కొడుక్కి ఫోన్ చేశారని ఆర్జేడీ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. ప్రధాని మోదీ.. ఆర్జేడీ అధినేత త్వరగా కోలుకోవాలనుకుంటున్నట్లు తెలిపారని ఆర్జేడీ అధికారి ప్రతినిధి వెల్లడించారు.

పాట్నాలోని 10 సర్క్యూలర్ రోడ్ లోని తన ఇంట్లో బీహార్ మాజీ సీఎం పడిపోయారు. వెంటనే సిటీ హాస్పిటల్ కు తరలించిగా.. ఈ 74ఏళ్ల లాలూ ఆరోగ్యం కుదుటగానే ఉందని వైద్యులు తెలిపారు. అతని ట్రీట్మెంట్ పలువురు వైద్యుల పర్యవేక్షణలో జరుగుతుందని సీనియర్ ఆర్జేడీ లీడర్ ఒకరు పేర్కొన్నారు.

Read Also : ఆస్పత్రిలో చేరిన లాలూ ప్రసాద్​ యాదవ్.. ఏమైందంటే?