Bengaluru : హఠాత్తుగా కుంగిన భూమి.. లోపల ఏమున్నాయంటే?

వ్యవసాయ భూమిలో తవ్వకాలు జరుపుతుండగా హఠాత్తుగా భూమి లోపలికి కుంగిపోయి భూమిలో దాచిన ప్రాచీన కాలం నాటి వస్తువులు బయటపడ్డాయి. ఈ ఘటన కర్ణాటకలోని బెంగళూరు రురల్ జిల్లా మాగడి తాలూకాలోని దేవర మఠానికి చెందిన భూముల్లో తవ్వకాలు జరుపుతుండగా భూమికుంగి ఒక గుహ, ప్రాచీన కాలం నాటి ఇత్తడి, తామ్రం, మట్టి వస్తువులు లభించాయి.

Bengaluru : హఠాత్తుగా కుంగిన భూమి.. లోపల ఏమున్నాయంటే?

Bengaluru

Bengaluru :  వ్యవసాయ భూమిలో తవ్వకాలు జరుపుతుండగా హఠాత్తుగా భూమి లోపలికి కుంగిపోయి భూమిలో దాచిన ప్రాచీన కాలం నాటి వస్తువులు బయటపడ్డాయి. ఈ ఘటన కర్ణాటకలోని బెంగళూరు రురల్ జిల్లా మాగడి తాలూకాలోని దేవర మఠానికి చెందిన భూముల్లో తవ్వకాలు జరుపుతుండగా భూమికుంగి ఒక గుహ, ప్రాచీన కాలం నాటి ఇత్తడి, తామ్రం, మట్టి వస్తువులు లభించాయి.

తట్టలు, దీపం స్తంభాలు, విభూధి ఉండలు, ఉయ్యాల స్తంబం, గంట తదితర వస్తువులు వెలుగుచూసాయి. గతంలో మఠానికి చెందిన స్వామీజీ ఒకరు సజీవ సమాధి అయ్యారని, ఆయన వస్తువులు కూడా సమాధిలో ఉండిపోయి ఇప్పుడు వెలుగు చూసాయని మఠం నిర్వాహకులు తెలిపారు.

పోలీసులు పురాతత్వ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. పురావస్తు శాఖ అధికారులు ఘటన స్థలికి చేరుకొని వాటిని స్వాధీనం చేసుకున్నారు.