JNU విద్యార్థులపై లాఠీ చార్జ్..అరెస్ట్ లు
ఢిల్లీలోని జేఎన్యూలో మొన్నటి హింసాత్మక ఘటనపై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కలిసేందుకు ఇవాళ(జనవరి-9,2020)సాయంత్రం ర్యాలీగా బయలుదేరిన విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. వారు ప్రతిఘటించడంతో పోలీసులు-విద్యార్థుల మధ్య ఘర్ణణ చోటుచేసుకుంది. విద్యార్థులపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. బిగ్గరగా నినాదాలు చేస్తున్న విద్యార్థులను ఈడ్చుకుంటూ వెళ్లి పోలీసుల వాహనంలో పడేశారు. ఈ ఘటనలో పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. బలవంతంగా విద్యార్థులను అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
దీంతో రాష్ట్రపతి భవన్ రోడ్డు మార్గంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. జేఎన్ యూ వైస్ ఛాన్సలర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, జేఎన్ యూ లో ఆదివారం నాటి దాడి ఘటనకు సంబంధించి హెచ్ఆర్డి మంత్రిత్వ శాఖ కార్యాలయాలకు వెళ్లి మొమోరాండమ్ సమర్పించేందుకు ఇవాళ సీనియర్ రాజకీయ నాయకులు సీతారాం ఏచూరి, డి రాజా, ప్రకాష్ కారత్, బృందా కారత్ మరియు శరద్ యాదవ్ సహా విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు పౌర సమాజ సంఘాలు మండి సభ నుండి కవాతును ప్రారంభించాయి.
అయితే హెచ్ ఆర్ డీ అధికారులతో సమావేశం తర్వాత జేఎన్ యూ స్టూడెంట్స్ యూనియన్ లీడర్ ఐషే గోష్ నేతృత్వంలో విద్యార్థులు రాష్ట్రపతి భవన్ కు ర్యాలీగా వెళ్లి రామ్ నాథ్ కోవింద్ ని కలవాలని డిసైడ్ అయ్యారు. అయితే పోలీసులు దానిని అనుమతించకపోవడంతో, విద్యార్థులు బిగ్గరగా చేయడం ప్రారంభించారు. ఢిల్లీ పోలీసు ముర్దాబాద్ అనే అరుపుల మధ్య, విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిర్బంధాలు ప్రారంభమయ్యాయి. విద్యార్థులను నగర నడిబొడ్డున ఉన్న కన్నాట్ ప్లేస్ వద్ద ఉన్న పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు.
Delhi: A protester injured during march towards Rashtrapati Bhavan demanding removal of the Jawaharlal Nehru University’s Vice Chancellor following Jan 5 violence in the campus pic.twitter.com/wdoq71M4Nv
— ANI (@ANI) January 9, 2020