తేజస్ లో విహరించిన తేజస్వీ

తేజస్ లో విహరించిన తేజస్వీ

Tejasvi Surya బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య.. తేజస్​ యుద్ధవిమానంలో ప్రయాణించారు. బెంగళూరులోని యళహంక వేదికగా జరుగుతున్న ‘ఏరో ఇండియా’ ప్రదర్శనకు వచ్చిన ఆయన ఫ్లయింగ్​ సూట్​ ధరించి ఈ విమానంలో విహరించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆయన తన ట్విటర్ ఖాతాలో షేర్‌ చేశారు. తేలికపాటి యుద్ధవిమానం(LAC)తేజస్..ఆత్మనిర్భర్ భారత్ సింబల్ అని..భారతదేశపు సైంటిఫిక్ ఎక్సలెన్స్ మరియు శక్తిసామర్థ్యాలను చూపే ఓ సంతేకమని ఈ సందర్భంగా తేజస్వీ సూర్య వ్యాఖ్యానించారు. ఈ అధ్భుతమైన ఫైటర్ జెట్ లో ఇవాళ ప్రమాణించేందుకు తనకు అవకాశం దక్కడం చాలా ఆనందం కలిగించిందని తెలిపారు. భారత్ కు బెంగుళూరు గిఫ్ట్ “తేజస్”అని ఈ యువ బీజేపీ ఎంపీ పేర్కొన్నారు.

కాగా, భారత వాయుసేన శక్తి సామర్థ్యాలను చాటిచెప్పే ‘ఏరో ఇండియా’ ప్రదర్శన ఆద్యంతం ఆకట్టుకుంటోంది. కర్ణాటక రాజధాని బెంగళూరులోని యళహంకలో 13వ ‘ఏరో ఇండియా’ ప్రదర్శనను రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ బుధవారం ప్రారంభించారు. తొలి రోజు రఫేల్‌, అమెరికా వైమానిక సంస్థకు చెందిన బీ-1బీ ల్యాన్సర్‌ సూపర్‌సానిక బాంబర్‌లు అలరించాయి. నాలుగేళ్ల కిందట భారతీయ వైమానిక విభాగంలో చేరిన ఎల్‌సీఏ తేజస్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సారంగ్‌, సూర్యకిరణ్‌ విమానాలు, సుఖోయ్‌ 30-ఎంకే1 విన్యాసాలతో ఆకట్టుకున్నాయి. శుక్రవారం వరకు ఈ ప్రదర్శన సాగనుంది.

ఎల్‌సీఏ(తేలికపాటి యుద్ధవిమానం) విభాగంలో తేజస్‌ ప్రపంచంలోనే అత్యుత్తమైందని చెబుతారు. వాస్తవానికి 35ఏళ్లకు పైగా సుదీర్ఘకాలం పాటు సాగిన ప్రాజెక్టు.. ఉత్పత్తి మందకొడిగా ఉంది.. విదేశీ పరికరాల వినియోగం ఎక్కువ.. ఇలా తేజస్‌పై పలు విమర్శలు వచ్చాయి. కానీ, ఈ విమానం సామర్థ్యంపై మాత్రం ఎటువంటి విమర్శలు లేవు.