Apple India : భారత్‌కు యాపిల్ కంపెనీ!

మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ పరంగా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద కంపెనీగా ఉన్న యాపిల్‌ నిర్ణయం విదేశీ కంపెనీలపైనా ప్రభావం చూపే అవకాశం ఉంది. చైనాపై ఆధారపడడాన్ని తగ్గించుకోవాలనుకుంటున్న కంపెనీలు భారత్‌ వైపు చూసే అవకాశం ఉంది.

Apple India : భారత్‌కు యాపిల్ కంపెనీ!

Apple Company

Apple to India : ప్రముఖ ఎలక్ట్రానిక్‌ తయారీ సంస్థ యాపిల్ భారత్‌కు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. దేశంలో కార్యాకలాపాలు విస్తరించేందుకు సన్నద్ధం అవుతున్నట్టు సమాచారం. ప్రస్తుతం యాపిల్ తయారీ కార్యాకలాపాలు చైనాలో కొనసాగుతున్నాయి. ఐఫోన్‌, ఐప్యాడ్‌, మ్యాక్‌బుక్‌ల తయారీ 90 శాతం చైనాలోనే జరుగుతోంది. ఆ దేశంలో కరోనా కేసుల పెరుగుదలతో లాక్‌డౌన్‌లో ఉంది.

దీంతో కఠిన ఆంక్షల ప్రభావం యాపీల్ తయారీ యూనిట్‌పై పడింది. ఈ నేపథ్యంలో తమ ఉత్పత్తుల తయారీని చైనా వెలుపలకు మార్చాలనుకుంటున్నట్లు కంపెనీ కాంట్రాక్టు తయారీదారులకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన కథనాన్ని వాల్‌స్ట్రీట్‌ జర్నల్ ప్రచురించింది. చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్‌, వియత్నాంపై యాపిల్‌ దృష్టి సారించినట్లు సమాచారం.

Apple Salaries: యాపిల్ ఇంజినీర్ల శాలరీలు కోట్లలోనే.. తగ్గేదేలే

మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ పరంగా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద కంపెనీగా ఉన్న యాపిల్‌ నిర్ణయం విదేశీ కంపెనీలపైనా ప్రభావం చూపే అవకాశం ఉంది. చైనాపై ఆధారపడడాన్ని తగ్గించుకోవాలనుకుంటున్న కంపెనీలు భారత్‌ వైపు చూసే అవకాశం ఉంది. అటు యుక్రెయిన్‌పై రష్యా చేస్తున్న దాడికి చైనా పరోక్షంగా మద్దతు పలకడం ఆయా కంపెనీలు పరిగణనలోకి తీసుకోవచ్చు.

లాక్‌డౌన్‌ల కారణంగా ప్రస్తుత త్రైమాసికంలో 8 బిలియన్‌ డాలర్లు విలువ చేసే విక్రయాలు దెబ్బతినే అవకాశం ఉందని యాపిల్‌ ఇటీవల తెలిపింది. గత ఏడాది తలెత్తిన విద్యుత్తు కోతలు కూడా తయారీపై తీవ్ర ప్రభావం చూపాయి. ఈ పరిణామాలతో చైనాకు దగ్గరగా ఉండే భారత్‌వైపు యాపిల్‌ చూస్తున్నట్లు సమాచారం.