అర్ధరాత్రి ఇంట్లోకి చిరుత : పెంపుడు కుక్కను చంపేసింది

హిమాచల్ ప్రదేశ్‌లో చిరుత పులి కలకలం సృష్టించింది. అర్ధరాత్రి ఓ ఇంట్లోకి ప్రవేశించి పెంపుడు కుక్కపై దాడి చేసి చంపేసింది.

  • Published By: veegamteam ,Published On : October 17, 2019 / 03:20 AM IST
అర్ధరాత్రి ఇంట్లోకి చిరుత : పెంపుడు కుక్కను చంపేసింది

హిమాచల్ ప్రదేశ్‌లో చిరుత పులి కలకలం సృష్టించింది. అర్ధరాత్రి ఓ ఇంట్లోకి ప్రవేశించి పెంపుడు కుక్కపై దాడి చేసి చంపేసింది.

హిమాచల్ ప్రదేశ్‌లో చిరుత పులి కలకలం సృష్టించింది. సిమ్లాలో అర్ధరాత్రి జనావాసాల్లోకి వచ్చిన చిరుత… ఓ ఇంట్లోని మెట్లెక్కి ఫస్ట్ ఫ్లోర్‌కు చేరుకుంది. అనంతరం అక్కడ తలుపు ఎదుట కాపలాగా పడుకున్న పెంపుడు కుక్క దగ్గరికి వెళ్లింది. కొద్దిసేపు ఆ కుక్కనే గమనించిన చిరుత… అదునుచూసి ఒక్కసారిగా దాడిచేసి చంపేసింది. 

ఆ తర్వాత ఆ కుక్కను కిందకు లాక్కెళ్లింది. ఇంట్లో నిద్రిస్తున్న వారు ఈ అలికిడితో బయటకు వచ్చారు. అప్పుడే కుక్కను లాక్కెళ్తున్న చిరుతను చూసి భయాందోళనకు గురయ్యారు. ఈ దృశ్యాలన్నీ ఆ ఇంట్లోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.