సైనికులకు సెల్యూట్ గా ఓ దీపం వెలిగించండి…మోడీ

  • Published By: venkaiahnaidu ,Published On : November 13, 2020 / 09:37 PM IST
సైనికులకు సెల్యూట్ గా ఓ దీపం వెలిగించండి…మోడీ

Light a diya as salute to soldiers: PM Modi దేశ రక్షణ కోసం పోరాడుతున్న సైనికులకు సెల్యూట్ చేసేందుకు ఈ దీపావళికి ఓ దీపం వెలిగించాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. దీపావళి సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని మోడీ సందేశాన్ని ఇచ్చారు. దేశం కోసం సైనికులు చేసే త్యాగాలను వర్ణించేందుకు మాటలు చాలవు… ఈ దీపావళికి సైనికుల కోసం ఓ దీపం వెలిగించండి… బోర్డర్‌లో ఉన్న వారి కుటుంబాలకు కూడా మనం థాంక్స్ చెబుదాం అని ప్రధాని మోడీ ట్విట్టర్‌ లో సూచించారు.



మరోవైపు,ప్రతిఏడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా దిపావళి పండుగను సరిహద్దుల్లోని జవాన్లతో కలిసి జరుపుకోనున్నారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. భద్రతా దళాలతో దీపావళి జరుపుకునేందుకు నరేంద్రమోడీ రేపు(నవంబర్-13,2020) సరిహద్దుల్లోని ఓ పోస్ట్ దగ్గరకు వెళ్లనున్నట్లు సమాచారం. గతేడాది జమ్మూకశ్మీర్ లోని రాజౌరి జిల్లాలో ఎల్ వోసీ వద్ద విధులు నిర్వహిస్తన్న భద్రతాదళాలతో మోడీ దీపావళి జరుపుకున్నారు.



2018లో ఉత్తరాఖండ్ లోని బోర్డర్ పొజిషన్ వద్ద దీపావళిని జవాన్లతో సెలబ్రేట్ చేసుకున్నారు మోడీ. 2017లో నార్త్ కశ్మీర్ లోని గురేజ్ సెక్టార్ లో దీపావళి వేడుకలు జవాన్లతో కలిసి జరుపుకున్నారు. 2015లో పంజాబ్ బోర్డర్ లో జవాన్లతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు మోడీ. భారత ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన 2014లో..సియాచిన్ గ్లేసియర్ బేస్ క్యాంప్ వద్ద జవాన్లతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నారు మోడీ.