Updated On - 6:55 am, Fri, 19 February 21
Lockdown మహారాష్ట్రలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. కొన్ని రోజులుగా కొత్త కేసులు, మరణాల సంఖ్య పెరుగుతున్నది. రోజువారీ నమోదు కేసుల సంఖ్య మళ్లీ ఐదు వేలు దాటింది. అమరావతి జిల్లాలో గత ఐదు రోజులుగా కరోనా కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్నది.
బుధవారం నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 5,427 కరోనా కేసులు, 38 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,81,520కు, మరణాల సంఖ్య 51,669కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 40,858 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
మరోవైపు కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతుండటంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న అమరావతి జిల్లాల్లో లాక్డౌన్ విధించింది. శనివారం (:ఫిబ్రవరి-20) రాత్రి 8 గంటల నుంచి సోమవారం ఉదయం 7 గంటల వరకు కఠినమైన లాక్డౌన్ అమలులో ఉంటుందని కలెక్టర్ తెలిపారు. ఇక కరోనా తీవ్రత ఎక్కువగా వున్నా యవత్మల్ జిల్లాలో కూడా ఆంక్షలు విధిస్తున్నట్లు అక్కడి కలెక్టర్ యండీ సింగ్ తెలిపారు. అయితే యవత్మల్ జిల్లాలోవిధించింది లాక్ డౌన్ కాదని అయన తెలిపారు
Oxygen Beds Full : కరోనా కల్లోలం, గుట్టలు గుట్టలుగా శవాలు..ఆక్సిజన్ బెడ్స్ ఫుల్
గుట్టలా పెరుగుతున్న కరోనా కేసులు|
లాక్డౌన్ ఉండదు.. ఆంక్షలు మాత్రమే.. రాత్రి 8గంటల నుంచి…
Maharashtra Police : మహారాష్ట్ర పోలీసు బలగాల్లో కరోనా.. మూడు వారాల్లో ట్రిపుల్ యాక్టివ్ కేసులు
Maharashtra : కరోనా విలయం, మహారాష్ట్రలో ఐసోలేషన్ వార్డులుగా మారుతున్న రైళ్లు
Serving In Flight Meals : విమానాల్లో రెండు గంటలు కన్నా..ఎక్కువ ప్రయాణించే వారికే ఫుడ్