Lockdown : కరోనా కల్లోలం.. భారత్‌లో అక్కడ మళ్లీ లాక్‌డౌన్

భారత్ లో కరోనా మహమ్మారి తీవ్రత క్రమంగా తగ్గుముఖం పట్టింది. కోవిడ్ కొత్త కేసులు గణనీయంగా తగ్గాయి. కరోనా మహమ్మారి ఇక అదుపులోకి వచ్చినట్టే అని ఊపిరి పీల్చుకునేలోపే మరోసారి కలకలం..

Lockdown : కరోనా కల్లోలం.. భారత్‌లో అక్కడ మళ్లీ లాక్‌డౌన్

Lockdown

Lockdown : భారత్ లో కరోనా మహమ్మారి తీవ్రత క్రమంగా తగ్గుముఖం పట్టింది. కోవిడ్ కొత్త కేసులు గణనీయంగా తగ్గాయి. కరోనా మహమ్మారి ఇక అదుపులోకి వచ్చినట్టే అని ఊపిరి పీల్చుకునేలోపే మరోసారి కలకలం రేగింది. కరోనా తీవ్రత పెరుగుతుండటంతో మరోసారి లాక్ డౌన్ విధించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

LPG Price: వారం రోజుల్లో మరో రూ.100 పెరగనున్న వంట గ్యాస్

అవును, దేశంలో మళ్లీ లాక్ డౌన్లు వస్తున్నాయి. దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా.. మరణాలు మాత్రం పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇవాళ 13వేల 451 కేసులు నమోదు కాగా.. 585 మంది చనిపోయారు. మరణాల రేటు దాదాపు 5 శాతంగా నమోదైంది. అయితే, బెంగాల్ లో కరోనా కేసుల తీవ్రత ఎక్కువగా ఉంది.

దీంతో అధికార యంత్రాంగం అలర్ట్ అయ్యింది. కరోనా తీవ్రత ఎక్కువగా దక్షిణ 24 పరగణాల జిల్లాలోని సోనార్ పూర్ మున్సిపాలిటీలో ప్రభుత్వం లాక్ డౌన్ ను విధించింది. మూడు రోజుల పాటు అన్నింటినీ బంద్ చేస్తూ ఉత్తర్వులను ఇచ్చింది. అత్యవసర సేవలు తప్ప అన్నింటిపైనా ఆంక్షలు విధించింది. రాష్ట్ర రాజధాని కోల్ కతాకు కేవలం 20 కిలోమీటర్ల దూరంలోనే సోనార్ పూర్ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటిదాకా సోనార్ పూర్ లో 19 కంటెయిన్ మెంట్ జోన్లను ఏర్పాటు చేశారు.

Sitting : ఎక్కువసేపు కూర్చునే ఉంటున్నారా..! గుండెజబ్బులు వచ్చే ఛాన్స్ అధికమే?

మరోవైపు దుర్గా పూజ పండుగల తర్వాత కరోనా కేసులు పెరగడంతో బెంగాల్ ప్రభుత్వానికి భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) లేఖ రాసింది. దుర్గా పూజ పండుగ నుంచి ఇప్పటిదాకా కరోనా కేసులు 25 శాతం పెరిగాయని లేఖలో ఆందోళన వ్యక్తం చేసింది. వైరస్‌ నియంత్రణ చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ నేపథ్యంలో సోనార్‌పూర్‌లో మూడు రోజుల పాటు లాక్‌డౌన్‌ను ప్రభుత్వం విధించింది. అత్యవసర సేవలకు మినహాయింపు ఇచ్చింది.

నిన్న ఒక్క కోల్ కతాలోనే 248 కేసులు, ఆరు మరణాలు నమోదయ్యాయని గుర్తు చేసింది. అయితే, కొత్త కేసుల్లో వ్యాక్సిన్ వేసుకున్న వారే ఎక్కువగా ఉంటున్నారని సీఎం మమతా బెనర్జీ చెబుతున్నారు.