Marriage in Train: నడుస్తున్న రైలులోనే అమ్మాయికి తాళికట్టేశాడు

ఓ వ్యక్తి పెళ్లైన మహిళ మేడలో తాళి కట్టాడు. అది కూడా రైల్లో.. దీంతో ఆ పెళ్ళికి సంబందించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Marriage in Train: నడుస్తున్న రైలులోనే అమ్మాయికి తాళికట్టేశాడు

Marriage In Train

Marriage in Train: ఓ వ్యక్తి పెళ్లైన మహిళ మేడలో తాళి కట్టాడు. అది కూడా రైల్లో.. దీంతో ఆ పెళ్ళికి సంబందించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వివరాల్లోకి వెళితే.. బీహార్ రాష్ట్రం సుల్తాన్‌గంజ్‌లోని భీర్ ఖుర్ద్ గ్రామానికి చెందిన అషు కుమార్, అను కుమారి ప్రేమించుకున్నారు. వీరి ప్రేమ వ్యవహారం అను కుమారి ఇంట్లో తెలియడంతో కుటుంబ సభ్యులు మందలించి ఆమెకు వేరే వ్యక్తితో వివాహం చేశారు.

అషుతో ప్రేమలో ఉన్న అను కుమారి.. పెళ్లైన తర్వాత భర్తలో సంతోషంగా గడపలేకపోయింది. దీంతో అత్తింటి నుంచి బయటపడాలని ప్లాన్ వేసింది. బుధవారం పారిపోయే అవకాశం రావడంతో ప్లాన్ ప్రకారం ఇంట్లో నుంచి సుల్తాన్‌గంజ్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. అక్కడ ప్రియుడు అషుతో కలిసి బెంగళూర్ వెళ్లే ట్రైన్ ఎక్కింది.

ట్రైన్‌లోనే వారిద్దరు పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత అషు కుమార్ మీడియాతో మాట్లాడాడు. ‘ట్రైన్ ఎక్కిన ఆమె మెడలో తాళి కట్టాల్సిందిగా అను ఒత్తిడి తెచ్చింది. దీందో రైలులో టాయిలెట్ ముందు నిలబడి ఆమె నూదుటిపై బొట్టు పెట్టాను. ఆ తర్వాత ఆమె మెడలో తాళి కట్టాను’అని చెప్పాడు. కాగా ప్రస్తుతం వీరి పెళ్ళికి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.