Lovers: కొద్దిరోజుల్లో పెళ్లి.. ప్రియుడితో కలిసి

పెళ్ళికి సమయం దగ్గర పడుతున్న సమయంలో ఓ యువతి ప్రియుడితో కలిసి ఆత్మహత్య చేసుకుంది. పెళ్లి ఇష్టం లేకనో, ప్రియుడిని వదులుకోలేకనో తెలియదు కానీ ఇద్దరు కలిసి ఆత్మహత్య చేసుకున్నారు

Lovers: కొద్దిరోజుల్లో పెళ్లి.. ప్రియుడితో కలిసి

Lovers

Lovers: పెళ్ళికి సమయం దగ్గర పడుతున్న సమయంలో ఓ యువతి ప్రియుడితో కలిసి ఆత్మహత్య చేసుకుంది. పెళ్లి ఇష్టం లేకనో, ప్రియుడిని వదులుకోలేకనో తెలియదు కానీ ఇద్దరు కలిసి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన ఒడిశా రాష్ట్రము నవరంగపూర్‌ జిల్లా ఉమ్మరకోట్‌ సమితి ముర్తుమా గ్రామంలో సోమవారం జరిగింది.

గ్రామానికి చెందిన సొస్మిత మఝి అనే యువతి ఉమ్మరకోట్‌ సమితి బొడొకుముడి గామ పంచాయతీ సనకుముడి గ్రామానికి చెందిన జుధిష్ట గొండ్‌ అనే యువకుడు ప్రేమించుకున్నారు. ఇద్దరు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ఇంట్లో పెద్దలకు చెప్పే దైర్యం లేక గమ్మునుండిపోయారు.

ఈ తరుణంలోనే సొస్మిత మఝికి ఉమ్మరకోట్‌ సమితి సుకిగాం పంచాయతీ డాబిడగుడ గ్రామానికి చెందిన యువకుడితో వివాహం నిశ్చయమైంది. మరికొద్ది రోజుల్లో పెళ్లి జరగనుంది. ఇరుకుటుంబాల వారు పెళ్లి పనుల్లో బిజీ, బిజీగా ఉన్నారు. ఈ సమయంలోనే పెళ్లి చేసుకునే యువతి ప్రేమికుడితో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది.

దీంతో ఇరు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. తమ కూతురు ప్రేమ విషయం ఇంట్లో చెప్పలేదని, చెబితే పెళ్ళిచేసేవారమని చెబుతూ తల్లిదండ్రులు రోదిస్తున్నారు. ప్రేమికుల ఆత్మహత్యపై ఉమ్మరకోట్‌ పోలీసులకు సమాచారం అందటంతో ఘటన స్థలానికి వచ్చి మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం తరలించారు. సంఘటన స్థలంలో కొన్ని కేకులు, మూడు పురుగు మందు సీసాలతో పాటు యువతి చెప్పులు, ఒక సైకిల్‌ పడి ఉన్నాయి.

వాటిని పోలీసులు సీజ్‌ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అన్ని కోణాల్లోనూ విచారణ చేపట్టారు.