Earthquake Hits Delhi : ఢిల్లీలో భూకంపం!
దేశ రాజధానిలో ఆదివారం(జూన్-20,2021)స్వల్ప తీవ్రతతో భూకంపం సంభవించింది.
Earthquake Hits Delhi దేశ రాజధానిలో ఆదివారం(జూన్-20,2021)స్వల్ప తీవ్రతతో భూకంపం సంభవించింది. మధ్యాహ్నాం 12:02గంటల సమయంలో ఢిల్లీలోని పంజాబీ బాగ్ ప్రాంతంలో భూమి కంపించింది.
రికర్ట్ స్కేలుపై దీని తీవ్రత 2.1గా నమోదయ్యిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (ఎన్సీఎస్) ప్రకటించింది. నార్త్ వెస్ట్ ఢిల్లీకి 8 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపింది. అయితే ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం కానీ జరగలేదని సమాచారం.