Madhya Pradesh : మద్యం తాగుతూ కారు డ్రైవింగ్..రోడ్డుపై కత్తితో మాజీ మంత్రి కొడుకు హల్ చల్

మద్యం మత్తు తలకెక్కి రోడ్డుమీద నానా హంగామా చేశాడు మాజీ మంత్రి కొడుకు. దీనికి తోడు ఓ వ్యక్తి కారు ఢీకొట్టి ఎదురు కత్తి పట్టుకుని నడిరోడ్డుమీద నానా హడావిడి చేశాడు.

Madhya Pradesh : మద్యం తాగుతూ కారు డ్రైవింగ్..రోడ్డుపై కత్తితో మాజీ మంత్రి కొడుకు హల్ చల్

Former Congress Minister Alleged Drunk Son Rams Car

Madhya Pradesh : మద్యం మత్తు తలకెక్కి రోడ్డుమీద నానా హంగామా చేశాడు మాజీ మంత్రి కొడుకు. దీనికి తోడు ఓ వ్యక్తి కారు ఢీకొట్టి ఎదురు కత్తి పట్టుకుని నడిరోడ్డుమీద నానా హడావిడి చేశాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. షాజాపూర్ కు చెందిన కాంగ్రెస్ మాజీ మంత్రి హుకుమా కరాడ కుమారుడు కుమారుడు రోహితప్ సింగ్ మద్యం మత్తులో రోడ్డు పై నానా హంగామా చేశాడు. దినేష్ అహుజా తన SVU కారులో అతడి అనుచరులతో కలిసి భూపాల్ నుంచి ఇండోర్ వెళ్తుండగా..మద్యం తాగుతూ రోడ్డు మీద ఉన్న వ్యాపారి దినేష్ అహుజా కారును ఢీ కొట్టాడు. దీన్ని ప్రశ్నించేసరికి అతగాడు రెచ్చిపోయాడు. కత్తి పట్టుకుని నానా హంగామా సృష్టించాడు.

రోహితప్ సింగ్ మద్యం తాగుతూ కారు డ్రైవింగ్ చేస్తున్నాడు.. ఈ క్రమంలో రోడ్డుపై తన కారును ఢీకొట్టడంతో వారు అతడిని ప్రశ్నించారు. దీంతో రోహితప్ కనీసం సారీ చెప్పకుండా ఎదురు వారిపై రెచ్చిపోయాడు..నానా బూతులు తిట్టాడు. బాధితులు పోలీస్ స్టేషన్ కు వెళతాం..కారుకు జరిగిన నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. దీంతో మరింతగా రెచ్చిపోయిన రోహితప్ మరోసారి దినేష్ కారును ఢీ కొట్టాడు. దీంతో దినేష్, అతని అనుచరులు రోహితప్ ను బయటకు దిగాలని డిమాండ్ చేశారు. రోహితప్ ఇంకా రెచ్చిపోయాడు. కారులో ఉన్న కత్తి తీసుకుని విసురుగా కారు దిగాడు. వారిని కత్తితో బెదిరించి అక్కడి నుంచి తన కారులో వెళ్లి పోయాడు. తమకు జరిగిన అన్యాయమపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్నట్లు అష్టా పోలీస్ స్టేషన్ ఇంచార్జ్ అనిల్ యాదవ్ దర్యాప్తు చేపట్టారు.