MP Govt : కరోనా మృతుల పిల్లలకు ఉచిత విద్య,నెలకు రూ.5 వేలు పింఛన్ : సీఎం ప్రకటన

కరోనాతో చనిపోయినవారి పిల్లలు అనాథలుగా మారుతున్న విషాదక పరిస్థితులు కన్నీరు పెట్టిస్తున్నాయి. ఇటువంటి పిల్లల కోసం మధ్యప్రదేశ్ ప్రభుత్వం కాస్త ఊరటనిచ్చే ప్రకటన చేసింది. తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన పిల్లలకు ప్రతి నెల రూ.5 వేలు పెన్షన్ అందిస్తామ‌ని ప్రక‌టించారు సీఎం శివరాజ్ సింగ్. రేష‌న్‌ను ఉచితంగా అందిస్తామని తెలిపారు.

MP Govt : కరోనా మృతుల పిల్లలకు ఉచిత విద్య,నెలకు రూ.5 వేలు పింఛన్ : సీఎం ప్రకటన

Mp Govt Announces

MP Govt Announces: కరోనాతో చనిపోయినవారి పిల్లలు అనాథలుగా మారుతున్న విషాదక పరిస్థితులు కన్నీరు పెట్టిస్తున్నాయి. ఇటువంటి పిల్లల కోసం మధ్యప్రదేశ్ ప్రభుత్వం కాస్త ఊరటనిచ్చే ప్రకటన చేసింది. కరోనా సోకి చనిపోయినవారి పిల్లలను ఆదుకుంటామని భరోసానిచ్చింది. ఈ పాండమిక్ సమయంలో ఎంతోమంది చిన్నారులు తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారుతున్నారు. ఇటువంటి పిల్లలను ఆదుకునేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం చిన్నారుల‌కు ప్రతి నెల ఆర్థిక సాయం అందించాల‌ని నిర్ణయించింది.

సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ..క‌రోనాతో త‌ల్లిదండ్రులు, సంర‌క్షకులను కోల్పోయిన పిల్లల‌కు ప్రతి నెల రూ.5 వేలు పెన్షన్ అందిస్తామ‌ని ప్రక‌టించారు. అటువంటి పిల్లలకు ఉచితంగా విద్యను అందిస్తామ‌ని..వారి కుటుంబాల‌కు రేష‌న్‌ను ఉచితంగా అందిస్తామని తెలిపారు.

 

మధ్యప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం 10 ,12 వ తరగతి పరీక్షలను వాయిదా వేసింది. పరీక్షలకు ప్రత్యామ్నాయ మార్గాలను బోర్డు పరిశీలిస్తోందని, 10 వ తరగతి, 12 బోర్డు పరీక్షలను త్వరలో నిర్వహించడానికి సంబంధించి ఏదైనా నిర్ణయాన్ని ప్రకటిస్తామని ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని ఆదుకునేందుకు సిద్ధమని, ముఖ్యంగా పిల్లల సంరక్షణ బాధ్యత తీసుకుంటున్నామని సీఎం శివ‌రాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు.

మ‌ధ్యప్రదేశ్‌లో కొత్తగా 8,970 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసులు 7,00,202కు చేరాయి. ఇందులో 1,09,928 కేసులు యాక్టివ్‌గా ఉండ‌గా, 5,83,595 మంది బాధితులు క‌రోనా నుంచి కోలుకున్నారు. మ‌రో 6,679 మంది బాధితులు క‌రోనా బారినపడి ప్రాణాలను కోల్పోయారు.

కాగా..జ‌మ్ముక‌శ్మీర్ రాష్ట్ర ప్రభుత్వం కూడా క‌రోనాతో త‌ల్లిదండ్రుల‌ను కోల్పోయిన చిన్నారుల‌కు ప్రత్యేక స్కాల‌ర్‌షిప్ అందిస్తామ‌ని క‌శ్మీర్ లెఫ్టినెంట్ గ‌వ‌ర్నర్ మ‌నోజ్ సిన్హా తెలిపారు.అలాగే ఏపీ ప్రభుత్వం కూడా కోవిడ్ బారిన పడి తల్లిదండ్రులు మరణించి అనాథలైన పిల్లలకు.. చికిత్స పొందుతున్న పిల్లలకు సంరక్షణ కేంద్రాల్లో వసతి కల్పిస్తామని తెలిపింది. దీంట్లో భాగంగా రాష్ట్రంలోని మొత్తం 13 జిల్లాల్లో సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి, నిర్వహణకు ప్రత్యేక అధికారులను నియమిస్తున్నారు అధికారులు.