ఇద్దరు పెళ్లాల ముద్దుల మొగుడు

  • Published By: murthy ,Published On : July 11, 2020 / 01:11 PM IST
ఇద్దరు పెళ్లాల ముద్దుల మొగుడు

కాలేజీ చదివే రోజుల్లో ప్రేమించిన అమ్మాయిుని, తల్లి,తండ్రులు కుదిర్చిన అమ్మాయినీ, ఇద్దరినీ పెళ్లి చేసుకున్నాడో మధ్య ప్రదేశ్ యువకుడు. బేతుల్ జిల్లా కెరియా గ్రామంలో జులై8న బంధు మిత్రుల మధ్య వైభవంగా జరిగిన పెళ్లిలో ఇద్దరు వధువుల మెడలో తాళి కట్టాడు ఆ యువకుడు.

గ్రామానికి చెందిన సందీప్ ఊకే తాను చదువుకునే రోజుల్లో ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. ఆమెతో ప్రేమ వ్యవహారం నడుస్తుండగానే అతడి తల్లి తండ్రులు సందీప్ కు వేరే యువతితో పెళ్లి సంబంధం కుదిర్చారు. తాను అప్పటికే ఒక యువతిని ప్రేమించానని పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోలేనని సందీప్ చెప్పాడు.

ఈ వ్యవహారం గ్రామంలో రచ్చబండ వద్దకు చేరింది. పంచాయితీ పెట్టిన గ్రామ పెద్దలు మూడు కుటుంబాలను పిలిపించారు. వరుడిపై అభిప్రాయం చెప్పమని యువతులు ఇద్దరినీ అడిగారు. అతడితో కలిసి ఉంటామని వారిద్దరూ తేల్చి చెప్పారు. ఇద్దరినీ పెళ్లి చేసుకోటానికి సందీప్ కూడా ఒప్పుకున్నాడు.

అమ్మాయిలకు వారి కుటుంబాలకు ఈ వివాహం పట్ల ఎటువంటి అభ్యంతరం లేకపోవటంతో గ్రామపెద్ద మిశ్రిలాల్ సమక్షంలో మూడు కుటుంబాల వారు హజరై ఒకే ముహూర్తానికి వైభవంగా వివాహం జరిపించి, వరుడిని, వధువులను దీవించారు.