Delta Plus Variant : దేశంలో డెల్టా ప్లస్ వేరియంట్ తొలి మరణం నమోదు, టీకా తీసుకోకపోవడం వల్లే..
భారత్ లో డెల్టా ప్లస్ వేరియంట్ కలకలం రేపుతోంది. దేశంలో డెల్టా ప్లస్ వేరియంట్ తొలి మరణం నమోదైంది. మధ్యప్రదేశ్
Delta Plus Variant : భారత్ లో డెల్టా ప్లస్ వేరియంట్ కలకలం రేపుతోంది. దేశంలో డెల్టా ప్లస్ వేరియంట్ తొలి మరణం నమోదైంది. మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో డెల్టా ప్లస్ వేరియంట్ సోకి బుధవారం ఒక మహిళ మృతి చనిపోయింది. టీకా తీసుకోకపోవడం వల్లే బాధితుడు మరణించాడని, టీకా తీసుకున్న నలుగుర రోగులు డెల్టా ప్లస్ ను జయించారని అక్కడి ప్రభుత్వం తెలిపింది. దీంతో ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఇప్పటికే ఈ వేరియంట్ వల్ల మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి.
మృతురాలి నుంచి తీసుకున్న నమూనాల జీనోమ్ సీక్వెన్సింగ్ ఆధారంగా సదరు మహిళ కరోనా వైరస్ డెల్టా ప్లస్ వేరియంట్ వల్లనే మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. సదరు మహిళ ఈ ఏడాది మే 23న డెల్టా వేరియంట్ బారిన పడినట్లు తెలిపారు. బాధితురాలి కంటే ముందు ఆమె భర్తకు కోవిడ్ సోకిందని.. కానీ అతడు అప్పటికే వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నాడని తెలిపారు. ఫలితంగా అతడు కోలుకున్నాడన్నారు. కానీ బాధితురాలు మాత్రం వ్యాక్సిన్ ఒక్క డోసు కూడా తీసుకోలేదని.. అందువల్లే ఆమె మృతి చెందిందని డాక్టర్లు చెప్పారు.
మధ్యప్రదేశ్లో ఇప్పటి వరకు మొత్తం 5 డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు వెలుగు చూశాయి. వీటిలో మూడు భోపాల్ నుంచి, రెండు ఉజ్జయిని నుంచి. ఈ ఐదుగురిలో వ్యాక్సిన్ వేయించుకున్న నలుగురు డెల్టా ప్లస్వేరియంట్ను జయించగా.. వ్యాక్సిన్ తీసుకొని మహిళ మృతి చెందారు. మహమ్మారి రూపం మార్చుకుని శక్తివంతంగా తయారవుతుంది. ఈ క్రమంలో కోవిడ్ బారిన పడినా ప్రాణాపాయం నుంచి తప్పించుకోవాలంటే టీకా వేయించుకోవడం తప్పనిసరి. కనుక ప్రతి ఒక్కరు టీకా వేయించుకోవాలని ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. 21 డెల్టా ప్లస్ కేసులు బయటపడటంతో మహారాష్ట్ర సర్కార్ అప్రమత్తమైంది.
కరోనా మహమ్మారి రోజురోజుకు రూపం మార్చుకుంటూ మరింత శక్తివంతంగా తయారవుతోంది. తాజాగా డెల్టా వేరియంట్ వ్యాప్తి ప్రారంభమైంది. ఇది మిగతా వాటికన్నా చాలా రెట్లు ప్రమాదకరమని అమెరికా అంటువ్యాధుల నిపుణుడు ఆంథోనీ ఫౌసి హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మన దేశంలో డెల్టా ప్లస్ వేరియంట్ తొలి మరణం నమోదవడం ఆందోళనకు గురి చేస్తోంది.