Madhya Pradesh : టాయిలెట్ క్లీన్ చేసిన బీజేపీ ఎంపీ
క్వారంటైన్ లో ఓ బీజేపీ ఎంపీ..టాయిలెట్ ను క్లీన్ చేశారు. కనీసం బ్రష్ ఉపయోగించకుండా చేతులకు గ్లౌజ్ లు ధరించి శుభ్రం చేయడం విశేషం.
Rewa MP : క్వారంటైన్ లో ఓ బీజేపీ ఎంపీ..టాయిలెట్ ను క్లీన్ చేశారు. కనీసం బ్రష్ ఉపయోగించకుండా చేతులకు గ్లౌజ్ లు ధరించి శుభ్రం చేయడం విశేషం. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో లో ఈ ఘటన చోటు చేసుకుంది.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రేవా నియోజకవర్గానికి ఎంపీగా జనార్ధన్ మిశ్రా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
కరోనా రాష్ట్రంలో విజృంభిస్తోంది. వైరస్ సోకిన వారిని క్వారంటైన్ లో తరలించి చికిత్స అందిస్తున్నారు. క్వారంటైన్ లో ఎలాంటి చికిత్స అందిస్తున్నారు ? తదితర వివరాలు తెలుసుకొనేందుకు బీజేపీ ఎంపీ జనార్ధన్ మిశ్రా పర్యటించారు. ఓ క్వారంటైన్ సెంటర్ కు వెళ్లారు. అక్కడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
అక్కడ టాయిలెట్ ను పరిశీలించారు. అపరిశుభ్రంగా ఉండడంపై మండిపడ్డారు. వెంటనే దానిని శుభ్రం చేసేందుకు నడుం బిగించారు. చేతులకు గ్లౌజ్ లు ధరించి..టాయిలెట్ ను శుభ్రం చేశారు. ఎంపీ ఒక్కరే ఈ పనిని చేశారు. తాను ఇలాంటి పని చేయడంద్వారా ఇతరులు ఇలాంటి పనులు చేసేందుకు ముందుకు వస్తారని సదరు ఎంపీ వెల్లడించారు.