మరణశిక్ష పడిన వ్యక్తిని నిర్దోషిగా ప్రకటించిన మద్రాస్ హైకోర్టు

  • Published By: bheemraj ,Published On : June 22, 2020 / 09:24 PM IST
మరణశిక్ష పడిన వ్యక్తిని నిర్దోషిగా ప్రకటించిన మద్రాస్ హైకోర్టు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తమిళనాడులోని తిరుపూర్‌ ‘పరువు హత్య’ కేసులో ప్రధాన నిందితుడిని మద్రాస్‌ హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. మిగిలిన ఐదుగురు నిందితులకు విధించిన మరణశిక్షను 25 ఏళ్ల యావజ్జీవ శిక్షగా మార్చింది. తల్లిదండ్రుల అభీష్టానికి వ్యతిరేకంగా కౌసల్య అనే యువతి దళిత సామాజికవర్గానికి చెందిన శంకర్‌ను 2016లో పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లిని కౌసల్య కుటుంబం తొలి నుంచీ వ్యతిరేకించింది. శంకర్‌ను అంతమొందించటానికి కుట్ర పన్నింది. 

(మార్చి 13, 2016) తిరుపూర్‌ జిల్లా ఉడుములపేటలో ముగ్గురు వ్యక్తులు శంకర్‌ను నడిరోడ్డుపై కౌసల్య ముందే దారుణంగా హత్య చేశారు. ఈ దాడిలో ఆమెకు కూడా గాయలయ్యాయి. ఈ కేసులో ఆమె తండ్రి చిన్నస్వామి, మరో ఐదుగురికి తిరుపూర్‌ జిల్లా సెషన్స్‌ కోర్టు (డిసెంబర్‌ 12, 2017)న మరణశిక్ష విధించింది. 

దీనిపై నిందితులు హైకోర్టును ఆశ్రయించగా తాజాగా తీర్పు వెలువడింది. కౌసల్య తల్లిని కూడా నిర్దోషిగా ప్రకటించింది. కాగా, ఈ తీర్పును సవాల్‌ చేస్తానని కౌసల్య తెలిపారు. తన తల్లిదండ్రులకు శిక్ష పడే వరకూ విశ్రమించనని యువతి పేర్కొన్నారు.