Maha Kumbhamela Corona : కొంపముంచిన మహాకుంభమేళా..దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌కు ప్రధాన కారణం

మహాకుంభమేళా.... దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌కు ప్రధాన కారణమంటూ అందరూ ఆరోపిస్తున్నారు. ఈ ఏడాది మహాకుంబ్‌ కోసం 91 లక్షల మంది యాత్రికులు హరిద్వార్ సందర్శించినట్లు నిర్వాహకులు ప్రకటించారు.

Maha Kumbhamela Corona : కొంపముంచిన మహాకుంభమేళా..దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌కు ప్రధాన కారణం

Maha Kumbhamela Is The Main Reason For The Corona Second Wave In The Country

Maha kumbhamela : మహాకుంభమేళా…. దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌కు ప్రధాన కారణమంటూ అందరూ ఆరోపిస్తున్నారు. ఈ ఏడాది మహాకుంబ్‌ కోసం 91 లక్షల మంది యాత్రికులు హరిద్వార్ సందర్శించినట్లు నిర్వాహకులు ప్రకటించారు. మెగా ఈవెంట్‌లోనే వైరస్‌ వ్యాప్తి చెందినట్లు తెలుస్తోంది. ఇది కొవిడ్‌ ప్రోటోకాల్‌ ఉల్లంఘన కింద అంతా ఆరోపిస్తున్నారు. కేసుల్లో భయంకరమైన పెరుగుదలకు కుంభమేళా రద్దీ ప్రధాన కారణమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ ఏడాది జనవరి 14 నుంచి ఏప్రిల్‌ 27 వరకు మొత్తం 91 లక్షల మంది యాత్రికులు గంగలో పవిత్ర స్నానం చేసినట్లు కుంభమేళా నిర్వాహకులు తెలిపారు. ఇందులో ఎక్కువ భాగం ఏప్రిల్‌ నెలలోనే వచ్చినట్లు తెలుస్తోంది. కనీసం 60 లక్షల మంది ప్రజలు… ఏప్రిల్‌ నెలలో పుణ్య స్నానాలు చేశారని… అయితే ఇదే మహమ్మారి సెకండ్‌ వేవ్‌కు ప్రధాన కారణంగా తెలుస్తోంది.

ఏప్రిల్ 12న సోమవతి అమావాస్య…. మొదటి షాహి స్నాన్ కోసం అత్యధికంగా 35 లక్షల మంది హరిద్వార్‌ చేరుకున్నారు. మార్చి 11 న మహా శివరాత్రి కోసం 32 లక్షల మంది యాత్రికులు స్నానం చేశారు. ఏప్రిల్ 14 న సుమారు 13 లక్షల మంది యాత్రికులు రెండవ షాహి స్నాన్ చేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఇక మూడవ షాహి స్నాన్‌ కోసం ఏప్రిల్‌ 27న కేవలం 25 వేల మంది మాత్రమే హరిద్వార్‌ వచ్చినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

కోవిడ్ ప్రోటోకాల్‌ పెద్దగా పాటించని కారణంగా… కనీసం 100 మంది మేళా అధికారులు అనారోగ్యానికి గురయ్యారు. వీరిలో నలుగురు మరణించారు. దీంతో ఈ కార్యక్రమాన్ని ముందుగా ముగించేందుకు కొన్ని అఖదా సంస్థలు బలవంతం చేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు. ప్రతి 12 సంవత్సరాలకు జనవరి నుంచి ఏప్రిల్ మధ్య మహాకుంభం జరుగుతుంది. ఈ సంవత్సరం, ప్రభుత్వం దీనిని ఒక నెలకు తగ్గించింది. అయితే హరిద్వార్‌లో చివరి రోజు వరకు షాహి స్నాన్‌ కొనసాగింది.

హరిద్వార్‌కు వచ్చిన యాత్రికులు… తిరిగి ఆయా రాష్ట్రాలకు వెళ్లడం వల్ల కరోనా వైరస్‌ కేసుల సంఖ్య తీవ్రంగా పెరిగినట్లు అధికారులు తెలిపారు. కుంభమేళా తర్వాత హరిద్వార్‌లో కొవిడ్ -19 పాజిటివ్ కేసులు బాగా పెరిగాయి. ఏప్రిల్ మధ్యలో కేవలం 2 రోజుల వ్యవధిలో 40 లక్షల మంది యాత్రికులు హరిద్వార్ చేరుకున్నారు.

గత వారం, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ లెక్కలు విస్తుగొలిపేలా ఉన్నాయి. హరిద్వార్‌లో ఇన్‌ఫెక్షన్ల సంఖ్య ఏప్రిల్ 1 న మొత్తం 15 వేల 226 నుండి ఏకంగా 31 వేల 596 కు పెరిగింది. అటు ఉత్తరాఖండ్‌లో 2 వేల 236 క్రియాశీల కొవిడ్ కేసులు…. కేవలం 20 రోజుల్లోనే 48 వేల 318 కు చేరుకున్నాయి.