పోకిరీలపై మూడో కన్ను నిఘా : బస్ కండక్టర్లకు బాడీ కెమెరాలు..!!

  • Published By: nagamani ,Published On : December 7, 2020 / 03:30 PM IST
పోకిరీలపై మూడో కన్ను నిఘా : బస్ కండక్టర్లకు బాడీ కెమెరాలు..!!

Maharashtra : bus conductors with body cameras : మహారాష్ట్రలోని ఔరంగాబాద్ బస్సుల్లో ఇక కండర్లతో జాగ్రత్తగా ఉండాల్సిందే. లేదంటే అరదండాలుతప్పవంటున్నారు అధికారులు. కండక్టరే కదాని..ముఖ్యంగా లేడీ కండక్టరే కదాని ఆకతాయి వేషాలేస్తే ఇక అంతే సంగతులు.



పిచ్చి వేషాలేసి తప్పించుకోవటానికి వీల్లేదు. ఎందుకంటే ఇకనుంచి బస్ కంటర్ల ఒంటికి మూడోకన్ను మిమ్మల్ని వేయి కళ్లతో పట్టించేస్తుంది. ఈ మూడో కన్ను నుంచి మీరు తప్పించుకోలేరు. ఇంతకీ విషయం ఏమిటంటే..ఔరంగాబాద్ బస్సులో ‘‘కండక్టర్ల బాడీకి కెమెరాలు’’ అమర్చనున్నారు అధికారులు. ఆకతాయిల వేధింపులకు ఇక ఈ మూడో కన్ను ప్రత్యక్ష సాక్ష్యం కానుందన్నమాట.



బస్సుల్లో ప్రయాణిస్తోన్న సమయంలో ఆకతాయిల అసభ్య ప్రవర్తన చాలా మందిని ఇబ్బంది పెడుతుంటుంది. ముఖ్యంగా మహిళా కండక్టర్లను అసభ్యంగా తాకుతూ… తోటి మహిళా ప్రయాణికుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తూ రాక్షసానందం పొందుతుంటారు కొంతమంది పోకిరిగాళ్లు.



ఇటువంటి ఆకతాయిల వెకిలి చేష్టలకు చెక్ పెట్టేలా మహారాష్ట్రలోని ఔరంగాబాద్ ఆర్టీసీ అధికారులు కండక్టర్ల బాడీలకు కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. కండక్టర్లు, తనిఖీ అధికారుల షర్టుల జేబుల్లో బాడీ కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.



దీంతో బస్సులో ప్రయాణిస్తున్న వారి ప్రవర్తన ఎలా ఉందనేది ఈ కెమెరాల్లో రికార్డవుతుంది. అంతే కాకుండా రియల్ టైంలో టికెట్ల పరిశీలన సాధ్యమవుతుందని ఔరంగాబాద్ స్మార్ట్ సిటీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అధికారి తెలిపారు.



రక్షణ శాఖలో పని చేసి పదవీ విరమణ పొందిన వారిని లైన్ ఇన్‌స్పెక్టర్లుగా నియమించారు. వీరు ప్రయాణికుల భద్రతను పర్యవేక్షిస్తారు. అలాగే ప్రయాణికుల అభిప్రాయాలను అధికారులకు చేరవేస్తారు.