Uddhav Thackeray: కాశ్మీరీ పండిట్లకు మహారాష్ట్ర అండగా ఉంటుంది: సీఎం ఉద్ధవ్ ఠాక్రే

కశ్మీరీ పండిట్లకు మహారాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని, వారికి సహాయం చేయడానికి అన్నివిధాలా కృషి చేస్తామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే హామీ ఇచ్చారు.

Uddhav Thackeray: కాశ్మీరీ పండిట్లకు మహారాష్ట్ర అండగా ఉంటుంది: సీఎం ఉద్ధవ్ ఠాక్రే

Uddav

Uddhav Thackeray: కశ్మీరీ పండిట్లకు మహారాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని, వారికి సహాయం చేయడానికి అన్నివిధాలా కృషి చేస్తామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే హామీ ఇచ్చారు. ఈమేరకు సీఎం కార్యాలయం శనివారం నాడు ఒక ప్రకటన విడుదల చేసింది. గత కొన్ని రోజులుగా కశ్మీర్ లోయలో కశ్మీరీ పండిట్లు, హిందువులను లక్ష్యంగా చేసుకుని హత్యలు జరుగుతున్నాయి. నెలరోజుల్లోనే తొమ్మిది మంది కాశ్మీరీ పండిట్లు హత్యకు గురయ్యారు. భయంతో వందలాది మంది కాశ్మీరీ పండిట్లు వలస పోతున్నారు. ఉగ్రవాద చర్యలపై దేశం మొత్తం ఆగ్రహంతో ఉందని సీఎం ఉద్ధవ్ అన్నారు. కాశ్మీర్ లోయలో పరిస్థితిపై ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ‘లోయలో కాశ్మీరీ పండిట్లు అక్షరాలా పరారీలో ఉన్నారని’ ఆయన అన్నారు.

Other Stories: No jobs in West Bengal: పరీక్షలు పాసైన వారందరికి ఉద్యోగాలు ఎక్కడి నుంచి తేవాలి: బెంగాల్ మంత్రి వ్యాఖ్యలు

“వారు ఇంటికి తిరిగి రావాలని కలలు కంటున్నారు, కాని వారు ఇంటికి తిరిగి వచ్చిన తరువాత, పండిట్లను పట్టుకుని చంపుతున్నారు. ఈ భయానక పరిస్థితిలో, పెద్ద సంఖ్యలో పండిట్లు పారిపోవడం ప్రారంభించారు, ఇది దిగ్భ్రాంతికరమైన మరియు కలవరపరిచే సంఘటన” అని ఠాక్రే అన్నారు. ఈ సమయంలో, శివసేన పార్టీ అధినేతగా మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఈ కష్టకాలంలో కశ్మీరీ పండిట్లకు మహారాష్ట్ర అండగా నిలుస్తుందని సీఎం ఉద్దవ్ హామీ ఇచ్చారు. 1995లో మహారాష్ట్రలో శివసేన ప్రభుత్వం ఏర్పడినప్పుడు శివసేన చీఫ్ బాలాసాహెబ్ ఠాక్రే మహారాష్ట్రలోని కశ్మీరీ పండిట్ల పిల్లలకు విద్యలో రిజర్వేషన్లు కల్పించిన సంగతి తెలిసిందే.