Mamata Banerjee : నేను వస్తున్నా.. అఖిలేష్‌‌కు మద్దతుగా మమత బెనర్జీ

ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ కోసం పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రంగంలోకి దిగారు. 2022, మార్చి 02వ తేదీ వారణాసికి చేరుకుంటారు. సాయంత్రం నిర్వహించే గంగా హారతిలో పాల్గొంటారని తెలుస్త

Mamata Banerjee : నేను వస్తున్నా.. అఖిలేష్‌‌కు మద్దతుగా మమత బెనర్జీ

Mamata

Varanasi : ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలు పీక్ స్టేజ్ కు చేరుకున్నాయి. మొత్తం ఏడు దశల్లో పోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఐదు దశల పోలింగ్ పూర్తి కాగా… మరో రెండు దశల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. మరోసారి అధికారం చేపట్టాలని బీజేపీ, ఎలాగైనా పాగా వేయాలని ఎస్పీ, కాంగ్రెస్, ఇతర పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. రెండు దశల్లో పోలింగ్ జరిగే నియోజకవర్గాల్లో ఆయా పార్టీల అభ్యర్థులు ప్రచారాన్నీ స్పీడప్ చేస్తున్నాయి. ప్రధానంగా బీజేపీ – ఎస్పీ పార్టీల మధ్య పోటీ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.

Read More : Night Curfew: నైట్ కర్ఫ్యూ పొడిగింపు.. ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

అయితే.. ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ కోసం పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రంగంలోకి దిగారు. 2022, మార్చి 02వ తేదీ వారణాసికి చేరుకుంటారు. సాయంత్రం నిర్వహించే గంగా హారతిలో పాల్గొంటారని తెలుస్తోంది. గంగా నదిపై ప్రధాన ఘాట్ గా పిలిచే.. దశాశ్వమేధ ఘాట్ ను సందర్శించనున్నారు. రెండు రోజుల పాటు యూపీలో పర్యటించనున్న సీఎం మమతా బెనర్జీ.. కాశీ విశ్వనాథ ఆలయాన్ని సందర్శించి పూజలు చేస్తారని సమాచారం. యూపీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవాలని ఎస్పీ కోరుకొంటోంది.

Read More : UP Election 2022: నేడే యూపీ 5వ దశ పోలింగ్.. ఇప్పటివరకు ఎన్ని స్థానాలకు ఓటింగ్ జరిగిందంటే?

అందులో భాగంగా.. అఖిలేష్ కు మద్దతు ఇచ్చేందుకు సీఎం మమతా బెనర్జీ యూపీకి వెళుతారని తృణముల్ కాంగ్రెస్ అధిష్టానం వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇటీవలే బెనర్జీ లక్నోను సందర్శించారు. అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీకి మద్దతు ఇచ్చారు. మరోవైపు.. వారణాసిని మరోసారి సందర్శించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా గురువారం టెంపుల్ టౌన్ లో ప్రచారం నిర్వహించే అవకాశం ఉంది. మార్చి 03వ తేదీన ఆరో దశ, మార్చి 07వ తేదీన ఏడో దశ పోలింగ్ జరుగనుంది. మార్చి 10వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి.