TV Channel Tamil Nadu : టీవీ ఛానల్‌ ఆఫీస్ లో కత్తులతో దుండగుడు బీభత్సం

తమిళనాడులోని ఓ ప్రముఖ టీవీ ఛానల్‌ కార్యాలయంలోకి దుండగుడు ఆయుధాలతో ప్రవేశించి బీభత్సం సృష్టించాడు. కత్తి, డాలు పట్టుకుని హల్ చల్ చేశాడు. కార్యాలయంలోని అద్దాలు, ఫోన్లు, కంప్యూటర్లు ధ్వంసం చేశాడు.

TV Channel Tamil Nadu : టీవీ ఛానల్‌ ఆఫీస్ లో కత్తులతో దుండగుడు బీభత్సం

Tamil Nadu

TV Channel Tamil Nadu : తమిళనాడులోని ఓ ప్రముఖ టీవీ ఛానల్‌ కార్యాలయంలోకి దుండగుడు ఆయుధాలతో ప్రవేశించి బీభత్సం సృష్టించాడు. కత్తి, డాలు పట్టుకుని హల్ చల్ చేశాడు. కార్యాలయంలోని అద్దాలు, ఫోన్లు, కంప్యూటర్లు ధ్వంసం చేశాడు. సిబ్బందిని బూతులు తిడుతూ నానా హంగామా చేశాడు. ఈ సంఘటన చెన్నెలో చోటుచేసుకుంది.

తమిళనాడులో సత్యం టీవీ ప్రముఖ ఛానల్‌ గా ఉంది. చెన్నెలోని రోయపురం కామరాజరర్‌ రోడ్డులో సత్యం టీవీ ఛానల్‌ కార్యాలయం ఉంది. మంగళవారం సాయంత్రం అకస్మాత్తుగా ఓ దుండగుడు కత్తి, డాలు తీసుకొని కార్యాలయంలోకి ప్రవేశించాడు. రిసెప్షన్‌లో కనిపించిన ఫోన్లు, అద్దాలు, కంప్యూటర్లను ధ్వంసం చేశాడు.

అనంతరం ఒకటో అంతస్తులోని అకౌంట్స్‌ డిపార్ట్‌మెంట్‌లోకి వెళ్లి బీభత్సం సృష్టించాడు. ఉద్యోగులంతా భయాందోళనకు గురయ్యారు. అతడిని అతికష్టం మీద సెక్యూరిటీ పట్టుకున్నారు. దుండగుడు కోయంబత్తూరుకు చెందిన డి.శివకుమార్‌గా గుర్తించారు. రోయపురం పోలీసులకు సమాచారం అందించగా కార్యాలయానికి చేరుకుని దుండగుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఈ దాడి ఘటనపై సత్యం టీవీ ఎండీ ఇసాక్‌ లివింగ్‌స్టన్‌ మాట్లాడుతూ అతడు ఎవరో, ఎందుకు దాడి చేశాడో తెలియడం లేదన్నారు. తాము ఎవరికీ వ్యక్తిగతంగా విరుద్ధ ప్రసారాలు చేయలేదని తెలిపారు. ఈ దాడికి సంబంధించిన సీసీ ఫుటేజీని ఆ ఛానల్‌ విడుదల చేసింది. కార్యాలయంపై దాడిని జర్నలిస్టు సంఘాలు ఖండించాయి. జర్నలిస్టులు, మీడియా కార్యాలయాలకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని చెన్నె ప్రెస్‌ క్లబ్‌ సంయుక్త కార్యదర్శి భారతి తమిళన్‌ డిమాండ్‌ చేశారు.