Delhi News: మహిళను ప్రేమగా ఇంటి బయటకు పిలిచి.. కసితీరా కత్తితో పొడిచాడు.

దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. ఓ మహిళపై ఇంటిపక్కన ఉండే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. వివరాల్లోకి వెళితే ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలోని సెక్టార్ -11 ప్రాంతంలో రాజు అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు.

Delhi News: మహిళను ప్రేమగా ఇంటి బయటకు పిలిచి.. కసితీరా కత్తితో పొడిచాడు.

Delhi News

Delhi News: దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. ఓ మహిళపై ఇంటిపక్కన ఉండే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. వివరాల్లోకి వెళితే ఢిల్లీ, రోహిణి ప్రాంతంలోని సెక్టార్ -11 లో రాజు అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. పక్కింట్లో ఉండే 28 ఏళ్ల మహిళకు ఫోన్ చేసిన రాజు ఆమెను బయటకు రావాలని కోరాడు.

ఇంటిపక్కన వ్యక్తి కావడంతో మహిళ వెనుకాముందు ఆలోచించకుండా బయటకు వచ్చింది. బయటకు రాగానే పక్కనే ఆగి ఉన్న రెండు కార్ల మధ్యలోకి బాధితురాలిని తీసుకెళ్లి కార్నర్ చేసి కత్తితో పలుమార్లు పొడిచాడు. ఈ సమయంలో సమీపంలో పదిమందికిపైనే ఉన్నారు. కానీ ఒక్కరు కూడా అడ్డుకునే ప్రయత్నం చేయలేదు.

కత్తిపోట్లకు మహిళ కిందపడటంతో రాజు అక్కడి నుంచి పారిపోయాడు. అనంతరం స్థానికులు బాధితురాల్ని అత్యవసర చికిత్స కోసం సఫ్దర్ గంజ్ ఆస్పత్రికి తరలించారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు పోలీసులు