Uttar Pradesh: పోలీస్ స్టేషన్లోనే తన్నుకున్నారు.. బాక్సింగ్ క్రీడను తలపించిన కొట్లాట.. వీడియో వైరల్
ఓ వ్యక్తి సహనం కోల్పోయాడు.. ఏకంగా కానిస్టేబుల్ మీదనే దాడికి దిగాడు. ఎక్కడో బయటకాదు.. ఏకంగా పోలీస్ స్టేషన్ లోనే కానిస్టేబుల్ ను కొట్టాడు. ఇక కానిస్టేబుల్, స్టేషేన్ లో ఉన్న పోలీసులు ఊరుకుంటారా.. యువకుడిపై పిడిగుద్దుల వర్షం కురిపించారు
Uttar Pradesh: ఓ వ్యక్తి సహనం కోల్పోయాడు.. ఏకంగా కానిస్టేబుల్ మీదనే దాడికి దిగాడు. ఎక్కడో బయటకాదు.. ఏకంగా పోలీస్ స్టేషన్ లోనే కానిస్టేబుల్ ను కొట్టాడు. ఇక కానిస్టేబుల్, స్టేషేన్ లో ఉన్న పోలీసులు ఊరుకుంటారా.. యువకుడిపై పిడిగుద్దుల వర్షం కురిపించారు. కుర్చీలు తీసుకొని కొట్టుకున్నారు. కొద్దిసేపు యువకుడు, కానిస్టేబుల్ మధ్య పోట్లాట బాక్సింగ్ గేమ్ ను తలపించింది. ఈఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని మెయిన్ పురిలో జరిగింది.
గృహహింస కేసులో కౌన్సెలింగ్ ఇచ్చేందుకు పోలీసులు సదరు వ్యక్తిని స్టేషన్ కు పిలిపించారు. అతని కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న క్రమంలో కానిస్టేబుల్ పై దుర్భాషలాడటం వీడియోలో కనిపించింది. దీంతో కానిస్టేబుల్ సదరు వ్యక్తిని మందలించే ప్రయత్నం చేశాడు. సహనం కోల్పోయిన వ్యక్తి కానిస్టేబుల్ చెంపపై కొట్టాడు. దీంతో ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో కొట్లాట చోటు చేసుకుంది. ఈ క్రమంలో అడ్డువచ్చిన మహిళా కానిస్టేబుల్ నుసైతం సదరు వ్యక్తి పక్కకు నెట్టే ప్రయత్నం చేశాడు. ఆమె అక్కడే ఉన్న కుర్చీని కానిస్టేబుల్ కు అదించడంతో కుర్చీలతో కొట్టుకున్నారు. ఎట్టకేలకు పోలీసులు యువకుడిని పట్టుకోవటంతో కొట్లాటకు తెరపడింది.
#WATCH | Young man loses temper, beats police official inside a police station premises in Mianpuri UP. He had been called for counselling in connection with another case.
(Note: Abusive language) pic.twitter.com/WhYJwa95NQ
— ANI UP/Uttarakhand (@ANINewsUP) July 5, 2022
మెయిన్పురి ఏఎస్పీ ఈ ఘటనపై స్పందించారు. పోలీస్ పై దాడికి దిగిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. గృహహింస కేసులో నిందితుడిగా ఉన్న అతడిని కౌన్సిలింగ్ నిమిత్తం పోలీస్ స్టేషన్ కు పిలిపించినట్లు తెలిపారు. పోలీస్ మాట్లాడుతున్న క్రమంలోనే నిందితుడు దాడికి దిగాడు. దీంతో అతన్ని అరెస్టు చేశామని ఏఎస్పీ అన్నారు. అతడి మానసిక పరిస్థితి సరిగా లేదని కుటుంబ సభ్యులు తెలిపారని, సదరు వ్యక్తి ట్రీట్ మెంట్ తీసుకున్న డాక్యుమెంట్లు అధికారులకు సమర్పిస్తే అవి పరిగణలోకి తీసుకుంటామని ఏఎస్పీ తెలిపారు.