Corona Virus : కరోనాతో మరణించిన వ్యక్తి.. రెండేళ్ల తర్వాత మళ్లీ బతికొచ్చాడు

2021లో కరోనా సెకండ్ వేవ్ లో 30 ఏళ్ల వ్యక్తి కమలేష్ కు కరోనా వైరస్ సోకింది. అతను చికిత్స పొందుతూ మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు.

Corona Virus : కరోనాతో మరణించిన వ్యక్తి.. రెండేళ్ల తర్వాత మళ్లీ బతికొచ్చాడు

Corona Virus

Corona Virus : కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాంచిన విషయం తెలిసిందే. కరోనా బారిన పడి లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఒక విచిత్ర సంఘటన జరిగింది. కరోనా వైరస్ సోకి మరణించిన ఓ వ్యక్తి రెండేళ్ల తర్వాత మళ్లీ బతికొచ్చాడు. కరోనా సెకండ్ వేవ్ లో వైరస్ సోకి ఒక వ్యక్తి మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. అప్పటి నిబంధనల ప్రకారం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించలేదు. మున్సిపల్ సిబ్బంది అంత్యక్రియలు నిర్వహించారు. ఇదిలావుంటే రెండేళ్ల తర్వాత ఆ వ్యక్తి సజీవంగా ఇంటికి తిగిరి వచ్చాడు.

తన కుటుంబ సభ్యులను కలిసి ఇంతకాలం తాను ఎక్కడున్నాడో తెలిపారు. మధ్యప్రదేశ్ లోని ధార్ జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. 2021లో కరోనా సెకండ్ వేవ్ లో 30 ఏళ్ల వ్యక్తి కమలేష్ కు కరోనా వైరస్ సోకింది. అతను చికిత్స పొందుతూ మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. అయితే అతడి మృతదేహాన్ని కుటుంబానికి అప్పగించలేదు. అప్పటి నిబంధనల ప్రకారం కరోనాతో మరణించిన మృతదేహాలకు మున్సిపల్ సిబ్బందే అంత్యక్రియలు నిర్వహించారు.

ఓ.. మైగాడ్….నేరం ఒప్పుకొన్నారు…శిక్ష అనుభవించారు….మర్డర్ అయిన వ్యక్తి తిరిగి వచ్చాడు !

కాగా, రెండేళ్ల తర్వాత కమలేష్ సజీవంగా ఇంటికి తిరిగి వచ్చాడు. దీంతో అతడిని చూసిన కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. చనిపోయిన వ్యక్తి ఎలా బతికి వచ్చాడని ఆశ్చర్యపోయారు. భార్యతోపాటు మిగతా కుటుంబ సభ్యులు కూడా కమలేష్ ను గుర్తు పట్టారు. అయితే అతడు ఎలా బతికి వచ్చాడని ఆరా తీశారు. కాగా, గుజారత్ లోని అహ్మదాబాద్ కు చెందిన ఒక ముఠా తనను అక్కడ బంధించినట్లు కమలేష్ పేర్కొన్నారు.

రోజు విడిచి రోజు వారు తనకు మత్తు ఇంజెక్షన్లు ఇచ్చినట్లు తెలిపారు. ఆ ముఠా నుంచి తప్పించుకుని బయటపడినట్లు చెప్పారు. మరోవైపు కమలేష్ సజీవంగా తిరిగి వచ్చిన విషయాన్ని అతడి కుటుంబ సభ్యులు స్థానిక మున్సిపల్ అధికారులకు తెలియజేశారు. దీంతో రెండేళ్ల క్రితం కరోనా వల్ల చనిపోయిన వ్యక్తి ఎవరన్న దానిపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.