Strange Incident In Bihar: రివేంజ్ తీర్చుకున్న భర్త..! ముఖేశ్ భార్యతో పరారైన నీరజ్.. అతని భార్యను పెళ్లాడిన ముఖేశ్.. బీహార్‌లో వింత ఘటన ..

బీహార్ రాష్ట్రంలోని ఖగాఢియా జిల్లాలో వింత ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి భార్యతో మరో వ్యక్తి పరారవ్వగా, నిందితుడి భార్యను బాధితుడు వివాహం చేసుకున్నాడు.

Strange Incident In Bihar: రివేంజ్ తీర్చుకున్న భర్త..! ముఖేశ్ భార్యతో పరారైన నీరజ్.. అతని భార్యను పెళ్లాడిన ముఖేశ్.. బీహార్‌లో వింత ఘటన ..

SPECIAL MARRIAGE

Strange Incident In Bihar: పెళ్లి చేసుకున్న తరువాత కూడా భర్త, పిల్లలను వదిలి ప్రియుడితో పారిపోయిన మహిళల ఘటనలు అనేకం చూస్తూనే ఉంటాం. ఇలాంటి ఘటనే బీహార్ రాష్ట్రంలో జరిగింది. అయితే, ఇక్కడ భర్త మాత్రం విచిత్రంగా ప్రవర్తించాడు. ప్రియుడితో వెళ్లిపోయిన భార్యను తన దగ్గరకు రప్పించుకునేందుకు ప్రయత్నాలు చేశాడు. అయితే, ఆ ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో తన భార్యపై,  తన భార్యను తీసుకెళ్లిన వ్యక్తిపై కోపం పెంచుకున్నాడు. రివైంజ్ తీర్చుకోవాలని భావించాడు.. కొద్దిరోజులకే తన భార్యతో పరారైన వ్యక్తి భార్యను పెళ్లిచేసుకొని తన కోపాన్ని తగ్గించుకున్నాడు. ఈ విచిత్ర ఘటన బీహార్ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో సైతం ఈ వార్త వైరల్ అవుతుంది.

Strange Incident : భార్యతో శృంగారంలో పాల్గొన్న 10 నిమిషాలకే మతిమరుపు..ఐర్లాండ్ లో విచిత్ర సంఘటన

బీహార్ రాష్ట్రం ఖగారియా జిల్లాలోని చౌతం బ్లాక్‌లోని హార్ధియా గ్రామంకు చెందిన నీరజ్ అనే వ్యక్తి 2009లో రూబీ అనే మహిళను వివాహం చేసుకున్నాడు. కుటుంబ సభ్యులందరి సమక్షంలో మహిళ అంగీకారంతో ఈ వివాహం జరిగింది. వీరికి నలుగురు పిల్లలు ఉన్నారు. పెళ్లికి ముందే రూబ్ పస్రాహా గ్రామానికి చెందిన ముఖేష్‌ అనే వ్యక్తితో ప్రేమలో ఉంది. పెళ్లి తరువాత కూడా వీరి అక్రమ సంబంధం కొనసాగింది. ముఖేశ్ కూ గతంలో వివాహం అయింది. అయితే, గతేడాది ఫిబ్రవరిలో అతను ప్రియురాలు రూబీని ఇంటి నుంచి తీసుకెళ్లి వివాహం చేసుకున్నాడు. వీరికి ముగ్గురు సంతానంతో గ్రామం వదిలి వెళ్లిపోయారు. ఈ విషయం తెలుసుకున్న భర్త నీరజ్ పస్రాహా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.

Strange Incident : అంత్యక్రియలకు స్మశానానికి తీసుకెళ్లాక బ్రతికిన వృద్ధురాలు

కొద్దిరోజులకు గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ జరిగింది. నీరజ్ భార్య తన ప్రియుడు(ముఖేశ్) ను వదిలి వచ్చేందుకు అంగీకరించలేదు. నీరజ్ తన భార్యను తనవద్దకు తీసుకొచ్చుకునేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో భార్య (రూబీ), ముఖేశ్ పై కోపం పెంచుకున్నాడు. వారికి తగిన బుద్ధిచెప్పాలని భావించాడు. ముఖేశ్‌ రూబీతో వెళ్లిపోకముందు పెళ్లిచేసుకున్న భార్య పేరుకూడా రూబీనే. ఈ విషయం తెలుసుకున్న నీరజ్ ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. పరిచయం కాస్త వారి మధ్య ప్రేమగా మారింది. దీంతో నీరజ్, రూబీ( ముఖేశ్ మొదటి భార్య)ని పెళ్లిచేసుకొని ప్రతీకారం తీర్చుకున్నాడు. ఈ నెల 18న వారి వివాహంలో ఆలయంలో జరిగింది. నీరజ్ ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు.