Mangaluru-Mumbai Train Derails : గోవా-కర్ణాటక సరిహద్దు వద్ద పట్టాలు తప్పిన ఎక్స్​ప్రెస్ రైలు

గోవా-కర్ణాటక బోర్డర్ లోని ప్రఖ్యాత దూద్​సాగర్ జలపాతం దగ్గర ఓ ఎక్స్​ప్రెస్ రైలు పట్టాలు తప్పింది.

Mangaluru-Mumbai Train Derails : గోవా-కర్ణాటక సరిహద్దు వద్ద పట్టాలు తప్పిన ఎక్స్​ప్రెస్ రైలు

Train (1)

Mangaluru-Mumbai Train Derails  గోవా-కర్ణాటక బోర్డర్ లోని ప్రఖ్యాత దూద్​సాగర్ జలపాతం దగ్గర ఓ ఎక్స్​ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. భారీ వర్షాల కారణంగా రైలు పట్టాలపై కొండ చరియలు విరిగి పడడంతో మంగళూరు నుంచి ముంబయి వెళ్తున్న రైలు(01134)శుక్రవారం ఉదయం సోనాలిమ్- దూద్​సాగర్ స్టేషన్ల మధ్య ప్రమాదానికి గురైంది.

రైలు ఇంజిన్ మరియు మొదటి జనరల్ బోగీ పట్టాలు తప్పింది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సౌత్ వెస్ట్రన్ రైల్వే అధికారులు తెలిపారు. పట్టాలు తప్పిన బోగీల్లోని ప్రయాణికులను వెంటనే వేరే బోగోల్లోకి తరలించారు. అదే సమయంలో దూద్​సాగర్-కరన్ జోల్ రైల్వే స్టేషన్ల మధ్య కూడా పట్టాలపై కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో మంగళూరు-ముంబై రైలుని రూట్  మార్చి  తిరిగి కులెమ్ రైల్వే స్టేషన్ కి తీసుకెళ్లారు.

కాగా,రైలు పట్టాలపై విరిగిపడ్డ కొండచరియలను తొలగించేందుకు సహాయకచర్యలు కొనసాగుతున్నాయి.