Maoist Killed In Encounter : బీజాపూర్-తెలంగాణ సరిహద్దులో ఎన్ కౌంటర్.. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు హిడ్మా మృతి

మావోయిస్టులకు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఎన్ కౌంటర్ లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు హిడ్మా మృతి చెందారు. బీజాపూర్-తెలంగాణ సరిహద్దులో ఎన్ కౌంటర్ జరిగింది. గ్రేహౌండ్స్, సీఆర్పీఎఫ్ కోబ్రా జాయింట్ ఆపరేషన్ నిర్వహించాయి.

Maoist Killed In Encounter : బీజాపూర్-తెలంగాణ సరిహద్దులో ఎన్ కౌంటర్.. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు హిడ్మా మృతి

ENCOUNTER (1)

Maoist Killed In Encounter : మావోయిస్టులకు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఎన్ కౌంటర్ లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు హిడ్మా మృతి చెందారు. బీజాపూర్-తెలంగాణ సరిహద్దులో ఎన్ కౌంటర్ జరిగింది. గ్రేహౌండ్స్, సీఆర్పీఎఫ్ కోబ్రా జాయింట్ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ ఎన్ కౌంటర్ లో హిడ్మా మృతి చెందినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని మావోయిస్టు కేంద్ర కమిటీ ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. బీజాపూర్-తెలంగాణ సరిహద్దులో మావోయిస్టులు, పోలీసుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.

ఈ ఎన్ కౌంటర్ మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా చనిపోయినట్లు సుష్మా ఎస్పీ ప్రకటించారు. కానీ మావోయిస్టు కేంద్ర కమిటీ మాత్రం ఇంకా అతని మృతిని ధృవీకరించలేదు. ఈ మెయిన్ ఆపరేషన్ లో హిడ్మాను టార్గెట్ చేసుకుని హెలికాప్టర్ ద్వారా ఈ కూంబింగ్ నిర్వహించినట్లు తెలుస్తోంది. భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో హిడ్మా చనిపోయినట్లు సమాచారం అందినా మావోయిస్టు కేంద్ర కమిటీ మాత్రం ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు.

Encounter Maoist Killed : ఛత్తీస్ గఢ్ లో ఎన్ కౌంటర్.. మావోయిస్టు మృతి

పోలీసులు మాత్రం అక్కడికి చేరుకోలేదు. ఇవాళ తెల్లవారుజాము నుంచి భారీ ఎన్ కౌంటర్ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే మావోయిస్టు పార్టీకి చెందిన సభ్యుడు, కీలక నేత, కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్న హిడ్మాను టార్గెట్ చేసుసుకుని ఈ కూంబింగ్ జరిపినట్లు తెలుస్తోంది. హిడ్మా చనిపోయినట్లు సుష్మా జిల్లా ఎస్పీ సమాచారం ఇచ్చినా.. అధికారికంగా ధృవీకరించలేదు. మావోయిస్టు పార్టీలో హిడ్మా కీలక నేతగా ఉన్నారు.

కూంబింగ్ లో అతను ప్రముఖ పాత్ర పోషించారు. ఏపీ ఎన్ కౌంటర్, గతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో పోలీసులు పెద్ద మొత్తంలో మరణించిన సంఘటనల్లో హిడ్మానే కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. మొత్తంగా హిడ్మానే టార్గెట్ చేసుకుని ఈ రోజు కూంబింగ్ నిర్వహించినట్లు తెలుస్తోంది. కాగా బీజాపూర్, సుస్మా జిల్లా, తెలంగాణ, ఏపీలో హిడ్మా తలపై ఇప్పటికే లక్ష రూపాయల రివార్డు ప్రకటించారు.