Maoists : చత్తీస్‌గఢ్ లో ఐఈడీ బాంబు పేల్చిన మావోయిస్టులు.. ముగ్గురు కూలీలకు గాయాలు

నారాయణపూర్-కంకేర్ సరిహద్దులోని అంజ్రోల్ సమీపంలో పోలీసులను టార్గెట్ చేసిన మావోయిస్టులు.. ఐఈడీ బాంబు పేల్చారు. ఈ ఘటనలో ముగ్గురు కూలీలకు గాయాలు అయ్యాయి.

Maoists : చత్తీస్‌గఢ్ లో ఐఈడీ బాంబు పేల్చిన మావోయిస్టులు.. ముగ్గురు కూలీలకు గాయాలు

Moaist 11zon

Maoists detonated IED bomb : చత్తీస్‌గఢ్ లో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. పోలీసులే లక్ష్యంగా ఐఈడీ బాంబు పేల్చారు. నారాయణపూర్-కంకేర్ సరిహద్దులోని అంజ్రోల్ సమీపంలో పోలీసులను టార్గెట్ చేసిన మావోయిస్టులు..ఐఈడీ బాంబు పేల్చారు. ఈ ఘటనలో ముగ్గురు కూలీలకు గాయాలు అయ్యాయి.

వారిని చికిత్స నిమిత్తం నారాయణపూర్ ఆసుపత్రికి తరలించారు. గత రాత్రి, నక్సలైట్లు ఈ ప్రాంతంలో బ్యానర్ పోస్టర్లు అంటించారు. రాఘాట్ ప్రాజెక్ట్ మరియు చార్గావ్ గనులను మూసివేయాలని గ్రామస్తులకు మావోయిస్టులు విజ్ఞప్తి చేశారు. పంప్ హౌస్ ను ధ్వంసం చేశారు.