అల్లుడితో అత్త సరసాలు…చూసి తట్టుకోలేని కూతురు…

  • Published By: murthy ,Published On : September 15, 2020 / 02:31 PM IST
అల్లుడితో అత్త సరసాలు…చూసి తట్టుకోలేని కూతురు…

వివాహేతర సంబంధాలతో కుటుంబాలు పతనమవుతున్నాయని తెలిసీ ప్రజలు వాటి పట్లే ఆకర్షితులవటం బాధ కలిగిస్తోంది. కన్నతల్లే పడక సుఖం కోసం అల్లుడితో లైంగిక సంబంధం పెట్టుకోవటం చూసి తట్టుకోలేని కూతురు పోలీసులను ఆశ్రయించింది.

బీహార్ లోని చాప్రా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. మాధవి అనే మహిళ తన ఇద్దరు ఆడపిల్లలతో కలిసి రాంఘడ్ ప్రాంతంలో నివిసిస్తోంది. మాధవి భర్త ఉద్యోగరీత్యా ముంబైలో ఉంటున్నాడు. మాధవి స్ధానికంగా ఉన్న ఒక పాఠశాలలో పని చేస్తోంది. ఆమెకు అదే స్కూల్ లో పనిచేసే ఒక యువ ఉపాధ్యాయుడు గోపాల్ తో పరిచయం ఏర్పడింది.



ఆపరిచయం మరింత సన్నిహితంగా మారింది. అప్పుడప్పుడు గోపాల్ మాధవి వాళ్ళింటికి వచ్చి వెళ్ళటం జరిగేది. భర్తకు దూరంగా ఉన్న మాధవి క్రమంగా గోపాల్ తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ బంధం మరింత ముదిరే సరికి మాధవి ఇంటికి గోపాల్ రాకపోకలు ఎక్కువయ్యాయి. తనకంటే వయస్సులో చిన్నవాడైన గోపాల్ సహచర్యంలో మాధవి ఆనంద డోలికల్లో తేలియాడేది.

గోపాల్ వచ్చే టైమ్ కు మాధవి పిల్లలిద్దరినీ ఏదో ఒక పని చెప్పి బయటకు పంపించటం చేసేది. పిల్లలు బయటకు వెళ్లగానే మాధవి, గోపాల్ ఇద్దరూ శృంగారంలో మునిగి తేలేవారు. కొన్నాళ్లకు ఇది మాధవి పెద్ద కూతురు కనిపెట్టింది. తల్లి రాసలీలలు ఓ కంట కనిపెడుతోంది. తమని బయటకు పంపి తల్లి చేసే పనులు నచ్చని పెద్ద కూతురు ఒకసారి మాధవిని నిలదీసింది. దీంతో మాధవి కొత్త ప్లాన్ వేసింది.



ఎలాగూ గోపాల్ తన కంటే వయస్సులో చిన్నవాడే….బాగా చదువుకున్నవాడు…. అవివాహితుడే….అతని ఆర్ధిక పరిస్ధితి కూడా ఆమెకు నచ్చింది. గోపాల్ కు తన పెద్ద కూతుర్ని ఇచ్చిపెళ్లి చేయాలని నిశ్చయించుకుంది. వీళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే గోపాల్ తో తాను శృంగార జీవితాన్ని ఎంజాయ్ చేయవచ్చు. కూతురికి మొగుడు దొరుకుతాడు అనుకుంది. ఈ ప్లాన్ గోపాల్ కు చెప్పింది. పెళ్లి చేసుకుంటే ఆంటీకి, ఆంటీ దక్కుతుంది. కూతురు దక్కుతుంది. తంతే వెళ్లి బూరెల బుట్టలో పడ్డట్టు  ఒకే చోట రెండు సుఖాలు దక్కుతాయని ఆలోచించాడు. ఓకే చెప్పాడు.

ఆర్నెల్ల క్రితం మైనార్టీ తీరని తన పెద్ద కూతురిని గోపాల్ కు ఇచ్చి పెళ్లి చేసింది మాధవి. ఇంకేముంది అప్పుడప్పుడు మాధవి ఇంటికి వచ్చే గోపాల్ అల్లుడు పేరుతో ఇంట్లోనే తిష్ట వేశాడు. ఇటు భర్తగా భార్యకు అన్నీ చేస్తూనే .. మరోవైపు అత్తైన మాధవి శృంగార కోరికలు చల్లారుస్తున్నాడు. ఇది చూసిన కుమార్తె తట్టుకోలేక పోయింది.



గోపాల్ ను, తల్లిని నిలదీసింది. తన కాపురం కూల్చవద్దని వేడుకుంది. అయినా మాధవిలోమార్పు రాలేదు. మరోవైపు గోపాల్ భార్యను కొట్టసాగాడు. దీంతో మాధవి కుమార్తె తన స్నేహితురాలి సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్నపోలీసులు మైనర్ తో వివాహం చట్ట విరుధ్ధం కనుక ముందస్తుగా  గోపాల్, మాధురి లను అరెస్ట్ చేశారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.