Satya Pal Malik : మోదీ చాలా అహంకారి..రైతులు ఏమైనా నా కోసం చనిపోయారా అని నాతో అన్నాడు

వ్యవసాయ చట్టాల రద్దు చేసిన కేంద్రం రైతుల పలు డిమాండ్లకు హామీ ఇవ్వడంతో ఏడాదికిపైగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేసిన రైతన్నలు తమ నిరసనలు ఇటీవల విరమించి ఇళ్లకు తిరిగెళ్లిన విషయం తెలి

Satya Pal Malik : మోదీ చాలా అహంకారి..రైతులు ఏమైనా నా కోసం చనిపోయారా అని నాతో అన్నాడు

Malik

Satya Pal Malik :  వ్యవసాయ చట్టాల రద్దు చేసిన కేంద్రం రైతుల పలు డిమాండ్లకు హామీ ఇవ్వడంతో ఏడాదికిపైగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేసిన రైతన్నలు తమ నిరసనలు ఇటీవల విరమించి ఇళ్లకు తిరిగెళ్లిన విషయం తెలిసిందే. అయితే రైతుల ఆందోళన ముగిసినప్పటికీ…ఈ అంశం చుట్టూ జరుగుతున్న రాజకీయం మాత్రం ఆగలేదు. వ్యవసాయ చట్టాలను మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకిచిన మేఘాలయ గవర్నర్ సత్యపాలిక్ కి సంబంధించి ఓ వీడియోను తాజాగా కాంగ్రెస్ పార్టీ తన ట్విట్టర్ లో పోస్ట్ చేయగా..ఈ అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

తాజాగా కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ లో షేర్ చేసిన వీడియోలో మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ మాట్లాడుతూ..”రైతుల అంశంపై నేను ప్రధానిని కలడానికి వెళ్లినప్పుడు 5 నిమిషాల పాటు మీటింగ్ లో ఆయనతో పోట్లాడాను..మోదీ చాలా అహంకారి. ఆందోళనల సమయంలో 500మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని నేను మోదీతో అన్నప్పుడు..నా కోసం ఏమైనా చనిపోయారా అని ప్రధాని అడిగారు. దానికి నేను అవును అని చెప్పారు.మీరు రాజు కాబట్టి అని ప్రధానితో అన్నారు. ఆ తర్వాత ఆయనతో పోట్లాట ఆపేశాను.అమిత్ షా ను కలవాలని మోదీ చెప్పారు..నేను వెళ్లి ఆ తర్వాత షాతో కలిశాను” అని సత్యపాల్ మాలిక్ మాట్లాడినట్లు ఆ వీడియోలో కనిపిస్తోంది. ఓ కుక్క చనిపోతే..సంతాపం తెలుపుతూ ప్రధాని లేఖలు పంపారని ఈ సందర్భంగా మాలిక్ గుర్తు చేశారు. కుక్కలకు ఇచ్చిన విలువ కూడా రైతులకు మోదీ ఇవ్వలేదని పరోక్షంగా మాలిక్ వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ నేత మల్లిఖార్జున ఖర్గే ట్విట్టర్ లో షేర్ చేసిన మరో వీడియోలో సత్యపాల్ మాలిక్ మాట్లాడుతూ..”నేను అమిత్ షాను కలిసినప్పుడు సత్య మోదీకి మైండ్ పనిచేయట్లేదు. మీరు నిర్లక్ష్యంగా ఉండండి, మమ్మల్ని కలుస్తూ ఉండండి” అని కేంద్ర హోంమంత్రి చెప్పారని మాలిక్ మాట్లాడినట్లు కనిపిస్తోంది.

హర్యానాలోని చక్రి దాద్రిలో ఓ పబ్లిక్ మీటింగ్ లో సత్యపాల్ మాలిక్ ఈ కామెంట్స్ చేశారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళన సమయంలో రైతులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవడంపై కేంద్రం నిజాయితీగా పనిచేయాలని,పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధమైన విధానం తీసుకురాలని కూడా సత్యపాలిక్ ఈ కార్యక్రమం సందర్భంగా సృష్టం చేశారు. రైతుల ఆందోళన కేవలం సస్పెండ్ చేయబడిందని,ఏదైనా వాళ్లకి అన్యాయం జరిగితే..ఆందోళన మళ్లీ మొదలుపెడుతారని మీడియాతో మాట్లాడుతూ ఓ ప్రశ్నకు సమాధానంగా మాలిక్ చెప్పారు.

కాగా,మోదీ సర్కార్ పై సత్యపాల్ మాలిక్ విమర్శలు గుప్పించడం ఇదేమీ మొదటిసారి కాదు. గతంలో అనేక సార్లు పలు సందర్భాల్లో కేంద్రం వైఖరిపై మాలిక్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ALSO READ Delhi Police Arrest: ఎయిర్‌పోర్ట్‌ల్లో వందల మందిని మోసం చేసిన వ్యక్తి అరెస్ట్