ప్రత్యేక రైళ్లలో రిజర్వేషన్ గడువు పెంపు
రైల్వే శాఖ ప్రయాణికులకు మరో శుభవార్త చెప్పింది. జూన్ 1 నుంచి నడిపే ప్రత్యేక రైళ్లలో ముందస్తు రిజర్వేషన్ గడువును రైల్వే శాఖ పెంచింది. ఇప్పటి వరకు 30 రోజులు ఉండగా..దానిని 120 రోజులకు పెంచింది. 30 రాజధాని తరహా రైళ్లు, 200 ప్రత్యేక మొయిల్ ఎక్స్ ప్రెస్ రైళ్లతో పాటు జూన్ 1 నుంచి నడిచే అన్నీ ప్రత్యేక రైళ్లకు ఇది వర్తిస్తుందని తెలిపింది. ఈ రైళ్లల్లో పార్సిల్స్, లగేజి బుకింగ్ లు కూడా అనుమతిస్తున్నట్లు రైల్వేశాఖ తెలిపింది.జూన్ 1 నుంచి తిరిగే 200 ప్రత్యేక రైళ్లకు సంబంధించి మే 21 నుంచి టికెట్ బుకింగ్ ప్రారంభమయ్యింది. కేవలం రిజర్వేషన్ బోగీలతోనే ఈ రైళ్లు నడవనున్నాయి.
Ministry Of Railways increases the advance reservation period (ARP) for all 30 Special Rajdhani type train &200 Special Mail Exp trains running since May 12 and to run from 1 June from 30 days to 120 days. Booking of parcel and luggage to be permitted in all these 230 trains.
— ANI (@ANI) May 28, 2020