మేనకాగాంధీ,కూటమి అభ్యర్థి మధ్య వాగ్వాదం

  • Published By: venkaiahnaidu ,Published On : May 12, 2019 / 04:05 AM IST
మేనకాగాంధీ,కూటమి అభ్యర్థి మధ్య వాగ్వాదం

కేంద్రమంత్రి,ఉత్తరప్రదేశ్ లోని సుల్తాన్ పూర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మేనకా గాంధీకి,ఎస్పీ-బీఎస్పీ కూటమి అభ్యర్థి సోనూ సింగ్ ల మధ్య సల్ప వాగ్వాదం చోటు చేసుకుంది.సోనూ మద్దతుదారులు ఓటర్లను భయపెడుతున్నారని ఆమె ఆరోపించారు.పోలీసుల జోక్యంతో వివాదం సద్దుమణిగి ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయారు.ఆరోదశలో భాగంగా ఏడు రాష్ట్రాల్లోని 59 లోక్ సభ స్థానాలకు ఇవాళ పోలింగ్ జరుగుతుంది.ఉత్తరప్రదేశ్ లో 14 లోక్ సభ స్థానాలకు ఇవాళ పోలింగ్ జరుగుతుంది