Madhya Pradesh : వర్షాలు కురవాలని నగ్నంగా బాలికల ఊరేగింపు

వరుణ దేవుడిని ప్రసన్నం చేసుకొనేందుకు...మైనర్ బాలికలను నగ్నంగా ఊరేగింపు నిర్వహించారు. అత్యంత దారుణమైన ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

Madhya Pradesh : వర్షాలు కురవాలని నగ్నంగా బాలికల ఊరేగింపు

Madhyapradesh

Minor Girls Paraded Naked : భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో వర్షాలు కుంభవృష్టిగా కురుస్తున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో వాన చినుకు కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. వర్షాలు కురిపించండి అంటూ..దేవుళ్లకు మొక్కుతున్నారు. అయితే..ఓ ప్రాంతంలో మాత్రం అలా చేయలేదు. మూఢనమ్మకాలతో వ్యవహరిస్తున్నారు. వరుణ దేవుడిని ప్రసన్నం చేసుకొనేందుకు…మైనర్ బాలికలను నగ్నంగా ఊరేగింపు నిర్వహించారు. అత్యంత దారుణమైన ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

Read More : Srisailam : శ్రీశైలంలో సహస్ర దీపార్చన, వీరభద్రుడికి ప్రత్యేక పూజలు

రాష్ట్రంలోని దమోహ్ జిల్లాలో బజేరా పీఎస్ పరిధిలో…బనియా గ్రామం ఉంది. చాలా ఏళ్లుగా వర్షాలు పడకపోతుండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా వ్యవసాయ రంగానికి చెందిన రైతులు పంటలను పండించలేక..నీళ్లు లేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఫలితంగా ఇక్కడ కరవు కరాళనృత్యం చేస్తోంది. బాలికలను నగ్నంగా ఊరేగింపు చేస్తే..వరుణ దేవుడు కరుణిస్తాడని..వర్షాలు కురుస్తాయనే అంధ విశ్వాసం గ్రామ పెద్దల్లో కనిపించింది.

Read More : Jobs : 858 ఉద్యోగాలు భర్తీ.. నోటిఫికేషన్ విడుదల

అనుకున్నదే తడవుగా…సభ్య సమాజం తలదించుకొనేలా ఒడిగట్టారు. జిల్లా కేంద్రానికి కేవలం 50 కిలోమీటర్ల దూరంలో జరిగిన ఈ దారుణానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీనిపై దర్యాప్తు ప్రారంభిచండం జరిగిందని, బాధ్యతులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పోలీసులు వెల్లడించారు. గ్రామంలో బాలికలను నగ్నంగా మార్చి…వారితో కప్ప ఊరేగింపు నిర్వహించారని దమోహ్ జిల్లా ఎస్పీ వెల్లడించారు. దీనిపై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.