ఎందుకు వెళ్లారు : ఢిల్లీలో అదృశ్యమైన తెలుగు డాక్టర్లు సురక్షితం

  • Published By: veegamteam ,Published On : January 2, 2020 / 05:50 AM IST
ఎందుకు వెళ్లారు : ఢిల్లీలో అదృశ్యమైన తెలుగు డాక్టర్లు సురక్షితం

ఢిల్లీలో అదృశ్యమైన తెలుగు డాక్టర్ల మిస్సింగ్ మిస్టరీ వీడింది. వారి  ఆచూకీ లభ్యమైంది. ఢిల్లీలో మిస్ అయిన డాక్టర్లు సిక్కింలో సురక్షితంగా ఉన్నారని పోలీసులు తెలిపారు. వారి  ఆచూకీ కోసం యత్నించిన పోలీసులు టెక్నీలజీ సహాయంతో సిక్కింలో ఉన్నట్లుగా గుర్తించారు. వెంటనే ప్రత్యేక పోలీసు టీమ్ లను సిక్కిం పంపించి వారిని సురక్షితంగా ఢిల్లీకి తీసుకొచ్చారు. ఈ విషయాన్ని వారి కుటుంబ సభ్యులకు తెలిపారు. కుటుంబ సభ్యుల పమక్షంలో వారికి పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు.  
 

కాగా..డిసెంబర్ 25న ఢి్లీ గౌతమ్ నగర్ నుంచి తెలుగు డాక్టర్లు అదృశ్యమయ్యారు. టెక్నాలజీని యూజ్ చేసిన పోలీసులు  మిస్ అయిన డాక్టర్ల బ్యాంక్ ఎకౌంట్స్ పై నిఘా పెట్టారు. దిలీప్ సత్య, హిమబిందు అనే మెడికల్ విద్యార్ధులు మిస్ అవ్వటంతో వారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హిమబిందు భర్త శ్రీధర్,  దిలీప్ సత్య భార్య దివ్యలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు వారి కోసం గాలించారు. వారిని ఎవరైనా కిడ్నాప్ చేశారా? లేదా హత్యకు గురయ్యారా? అనేకోణంలో దర్యాప్తును ముమ్మరం చేసిన పోలీసులు వారి బ్యాంక్ ఎకౌంట్స్ పై నిఘా పెట్టారు.  

అలాగే వారి సోషల్ మీడియా ఎకౌంట్స్ పై కూడా నిఘా పెట్టారు. వారి ఎకౌంట్స్ నుంచి డబ్బులు డ్రా చేయటం..ఎక్కడెక్కడ డ్రాలు జరుగుతున్నాయి? క్రెడిట్ కార్డులు ఎక్కడెక్కడ యూజ్ అవుతున్నాయి అనే కోణంలో నిఘా పెట్టారు. దీంతో వారు సిక్కింలో ఉన్నట్లుగా పోలీసు బృందాలు గుర్తించాయి. దిలీప్ సత్య, హిమబిందులు మిస్ అవ్వటంతో తీవ్రమైన సంచలనం సృష్టించింది.  వారి ఆచూకీ గురించి తెలిసినవారు వెంటనే తెలియజేయాలంటూ సోషల్ మీడియాలో కూడా ప్రచారం జరిగింది. ఈ క్రమంలో ఢిల్లీ పోలీసులపై ఒత్తిడి పెరిగింది. ఢిల్లీలోని డాక్టర్స్ అసోసియేషన్స్ కేంద్ర ఆరోగ్య శాఖకు లేఖ రాశారు.
 
ఈ క్రమంలో దిలీప్ సత్య, హిమబిందుల ఆచూకీ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలుగా విడిపోయి గాలింపు ముమ్మరంచేశారు. ఈ క్రమంలో వారు సిక్కింలో ఉన్నట్లుగా గుర్తించిన పోలీసులు వారిని ఢిల్లీకి తీసుకువచ్చారు. కుటుంబ సభ్యుల సమక్షంలో వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు. వారు ఎటువంటి పరిస్థితుల్లో వెళ్లాల్సి వచ్చింది. వారిద్దరి మధ్యా ఉన్న సంబంధం ఏమిటి? కుటుంబాల్లో ఏమన్నా కలహాలు ఉన్నాయా? విభేదాలు ఉన్నాయా? అనే అంశాలను వారి నుంచి పోలీసులు అడిగి తెలుసుకుంటున్నారు. ఢిల్లీనుంచి సిక్కిం ఎందుకు వెళ్లాల్సి వచ్చింది. ఇటువంటి పరిస్థితికి ఎందుకు రావాల్సి వచ్చింది అని పోలీసులు దిలీప్ సత్య, హిమబిందులన ప్రశ్నిస్తున్నారు. కౌన్సిలింగ్ అనంతరం కుటుంబ సభ్యులకు వారిని అప్పగించనున్నారు.