విద్యార్థి లేఖకు మోడీ రిప్లై

విద్యార్థి లేఖకు మోడీ రిప్లై

Modi replies back తాను రాసిన లేఖకు ప్రధానమంత్రి నుంచి స్పందన రావడంతో పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు చెందిన బీఎస్సీ మూడో సంవత్సరం విద్యార్థి ప్రణవ్‌ మహాజన్‌ సంభ్రమాశ్చర్యాలకు గురయ్యాడు. తాను రాసిన లెటర్ కు నరేంద్ర మోడీ ప్రతిస్పందించడం పట్ల ప్రణవ్‌ ఆనందం వ్యక్తం చేశాడు.

అసలేం జరిగింది
పరీక్షల సందర్భంగా ఒత్తిడిని తగ్గించుకోవడం, మంచి మార్కులు సాధించడం ఎలాగో వివరిస్తూ ‘ఎగ్జామ్‌ వారియర్స్‌’ అనే పేరుతో మోడీ ఓ బుక్ ను రచించిన విషయం తెలిసిందే. మోడీ రాసిన ఎగ్జామ్ వారియర్స్ పుస్తకాన్ని చదివి స్ఫూర్తి పొందానంటూ పంజాబ్ కు చెందిన ప్రణవ్ మహాజన్ ప్రధానికి లేఖ రాశాడు. పరీక్షల సమయంలో తాను చాలా ఒత్తిడికి గురయ్యేవాడినని..అయితే ప్రధాని రాసిన బుక్ చదివిన తర్వాత తాను ఎగ్జామ్ గురించి ఒత్తిడి ఎదుర్కోలేదని..ఆ బుక్ లో సూచించినట్లుగా నిత్యం యోగా, వ్యాయామం చేస్తున్నానని, అవి తనకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని ఆ లేఖలో పేర్కొన్నాడు.

ప్రణవ్‌ లేఖపై మోదీ ప్రతిస్పందిస్తూ గురువారం లేఖ రాశారు. తాను ఈ బుక్ రాయడానికి ప్రేరణ.. యువ స్నేహితుల ఉత్సుకత అని మోడీ తెలిపారు. పుస్తకం రాయడానికి ప్రేరణ పొందాడు. ఈ పుస్తకం పరీక్షల పట్ల మీ వైఖరిలో సానుకూల మార్పు తీసుకురావడంలో సహాయపడిందని తెలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది మరియు ఇప్పుడు మీరు పరీక్షలతో ఒత్తిడికి గురికావడం లేదు, కానీ వాటిని పండుగలా జరుపుకోవడానికి మీరు ప్రేరణ పొందారు అని ప్రధాని మోడీ లేఖలో చెప్పారు నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించడానికి కఠోర శ్రమ, అంకితభావంతో నీ పరిజ్ఞానాన్ని, నైపుణ్యాలను, సామర్థ్యాలను ఎప్పటికప్పుడు పెంచుకుంటూ పోవాలి. నిన్ను నీవు మెరుగుపర్చుకోవాలి. అదే నిన్ను జీవితంలో ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంద అని ప్రణవ్‌కు రాసిన లేఖలో ప్రధాని మోడీ ఉద్బోధించారు. మోడీ ప్రతిస్పందనతో ప్రణవ్ మహాజన్ సంభ్రమాశ్చర్యాలకు గురయ్యాడు.