మోడీ ఆసక్తికర ట్వీట్ : వీడియో సందేశంలో ఏం చెబుతారు ? సర్వత్రా ఉత్కంఠ
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేసిన ఓ ట్వీట్ వైరల్ గా మారిపోయింది. 2020, ఏప్రిల్ 02వ తేదీ గురువారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన అనంతరం చేసిన ఈ ట్వీట్ హాట్ టాపిక్ అయ్యింది. 2020, ఏప్రిల్ 03వ తేదీ శుక్రవారం ఉదయం 9 గంటలకు ఓ వీడియో షేర్ చేయనున్నట్లు తెలిపారు. భారతీయులతో ఒక చిన్న వీడియో సందేశాన్ని పంచుకోబోతున్నా..అంటూ ఇంగ్లీషు, హిందీ భాషల్లో ట్వీట్ చేశారు.
కొన్ని క్షణాల్లో ఈ ట్వీట్ వైరల్ గా మారిపోయింది. అసలు ఏం చెబుతారు ? లాక్ డౌన్ ఎత్తివేస్తారా ? దశల వారీగా ఎత్తివేస్తే..మొదట ఏ రాష్ట్రం ఉంటుంది ? ప్రస్తుతం ఉన్న కేసుల పరంగా చూస్తే..లాక్ డౌన్ సమయాన్ని పెంచుతారా ? ఇలాంటి సందేహాలు ఎన్నో వ్యక్తమౌతున్నాయి. మార్చి 21 నుంచి లాక్ డౌన్ అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. చైనా నుంచి వచ్చిన ఈ భూతం భారతేదేశాన్ని గడగడలాడిస్తోంది. వేల సంఖ్యలో కేసులు నమోదవుతుంటే..50 మంది దాక చనిపోయారు. ప్రస్తుతం రెండో దశలో ఉంది.
గురువారం అన్ని రాష్ట్రాల సీఎంలతో పీఎం మోడీ మాట్లాడారు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలు, చేస్తున్న ఏర్పాట్లను ఆయన అడిగి తెలుసుకున్నారు. లాక్ డౌన్ మరింత పటిష్టంగా అమలు చేయాలని సూచించారు. లాక్ డౌన్ ఎత్తివేస్తే జరిగే పరిణామాలపై కూడా చర్చించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మోడీ శుక్రవారం ఉదయం 9 గంటలకు ఇచ్చే సందేశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
At 9 AM tomorrow morning, I’ll share a small video message with my fellow Indians.
कल सुबह 9 बजे देशवासियों के साथ मैं एक वीडियो संदेश साझा करूंगा।
— Narendra Modi (@narendramodi) April 2, 2020
Also Read | COVID-19 లాంటి వైరస్లను తట్టుకోవడానికి ఊపిరితిత్తుల బలం పెంచుకోండిలా..