National
మహారాష్ట్రలో 22 లక్షలకుపైగా కరోనా కేసులు
దేశంలో మళ్లీ కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో కరోనా మరోసారి కలకలం రేపుతోంది.
దేశంలో మళ్లీ కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో కరోనా మరోసారి కలకలం రేపుతోంది.
Publish Date - 9:39 pm, Sat, 6 March 21
22 lakh corona cases in Maharashtra : దేశంలో మళ్లీ కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో కరోనా మరోసారి కలకలం రేపుతోంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు, మరణాల సంఖ్య పెరుగుతోంది. రోజువారీ కరోనా కేసుల నమోదు 10 వేలు, యాక్టివ్ కేసుల సంఖ్య 90 వేలు దాటింది.
శుక్రవారం నుంచి శనివారం వరకు కొత్తగా 10,187 కరోనా కేసులు, 47 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 22,08,586కు, మరణాల సంఖ్య 52,440కు చేరింది. మరోవైపు గత 24 గంటల్లో 6,080 మంది కరోనా రోగులు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 20,62,031కు చేరినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రంలో 92,897 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వెల్లడించింది. కాగా, దేశవ్యాప్తంగా కరోనా కేసులు, మరణాల సంఖ్యలో మహారాష్ట్ర తొలిస్థానంలో ఉంది.
మహారాష్ట్రలో ఒక్కరోజే 63,739 కరోనా కేసులు,398 మరణాలు
Give A Bed Or Kill : బెడ్ ఇవ్వండి లేదా చంపేయండి.. కరోనా సోకిన తండ్రికి చికిత్స అందక కొడుకు ఆవేదన, 2రాష్ట్రాలు తిరిగినా దొరకని బెడ్
ఈ ఒక్క దృశ్యం చాలు.. దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి
Oxygen Beds Full : కరోనా కల్లోలం, గుట్టలు గుట్టలుగా శవాలు..ఆక్సిజన్ బెడ్స్ ఫుల్
గుట్టలా పెరుగుతున్న కరోనా కేసులు|
లాక్డౌన్ ఉండదు.. ఆంక్షలు మాత్రమే.. రాత్రి 8గంటల నుంచి…