Varun Singh : భోపాల్‌ చేరిన వరుణ్ సింగ్ భౌతికకాయం..రూ.కోటి సాయం ప్రకటించిన సీఎం

తమిళనాడు హెలికాప్టర్​ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బెంగళూరు హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతూ బుధవారం మరణించిన గ్రూప్​ కెప్టెన్​ వరుణ్​ సింగ్​ భౌతిక కాయం ఆయన

Varun Singh : భోపాల్‌ చేరిన వరుణ్ సింగ్ భౌతికకాయం..రూ.కోటి సాయం ప్రకటించిన సీఎం

Varun Singh2

Varun Singh : తమిళనాడు హెలికాప్టర్​ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బెంగళూరు హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతూ బుధవారం మరణించిన గ్రూప్​ కెప్టెన్​ వరుణ్​ సింగ్​ భౌతిక కాయం ఆయన స్వరాష్ట్రం మధ్యప్రదేశ్​కు చేరుకుంది. భోపాల్​ విమానాశ్రయంలో ఆయన మృతదేహానికి నివాళులు అర్పించారు ఐఏఎఫ్​ అధికారులు,మధ్యప్రదేశ్​ మంత్రులు,సైనిక అధికారులు.

అనంతరం.. పార్థివ దేహాన్ని ఆయన స్వగృహానికి తరలించారు. మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్ సింగ్‌ చౌహాన్‌..వరుణ్ సింగ్ ఇంటికి చేరుకుని ఆయన భౌతికకాయానికి నివాళి అర్పించారు. వరుణ్​ సింగ్​ కుటుంబానికి రూ. కోటి సాయంతో పాటు ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించనున్నట్లు చౌహాన్ ప్రకటించారు. ఆయన అంత్యక్రియలను రాష్ట్ర ప్రభుత్వ సహా సైనిక లాంఛనాలతో నిర్వహించనున్నట్లు చౌహాన్​ స్పష్టం చేశారు.

ఏదైనా ఒక సంస్థకు  వరుణ్​ సింగ్​ పేరు పెడతామని లేదా ఆయన విగ్రహం నిర్మిస్తామని ముఖ్యమంత్రి శివరాజ్​సింగ్​ చౌహాన్​ స్పష్టం చేశారు. ఏం చేయాలో వరుణ్​ కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకోనున్నట్లు చౌహాన్ తెలిపారు. కాగా,శుక్రవారం వరుణ్ సింగ్ అంత్యక్రియలు జరగనున్నట్లు సమాచారం.

ALSO READ 1971 War Anniversary : అందుకు భయపడే..ఇందిర పేరును మోదీ సర్కార్ విస్మరించింది!