ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడుతున్న వ్యక్తిని, తల్లీకూతురు కలిసి చావబాదారు

ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడుతున్న వ్యక్తిని, తల్లీకూతురు కలిసి చావబాదారు

కరాందాయ్ లోని పెరియార్ నగర్ లో ఉండే మాలికా ఆమె కూతురు ధనలక్ష్మీ (32)కు ఫోన్ వేధింపులు wrong calls ఎక్కువయ్యాయి. గత వారం ఎన్ పెరియసామి అనే వ్యక్తి నుంచి ఆమెకు ఫోన్ వచ్చింది. అది రాంగ్ నెంబర్ అని చెప్పి అతనికి చెప్పిన ధనలక్ష్మీ కట్ చేసింది. అయినా ఆగకుండా రిపీటెడ్‌గా కాల్ చేస్తూ.. తప్పుడు మాటలు మాట్లాడటం మొదలుపెట్టాడు.

ధనలక్ష్మీ, ఆమె తల్లి కాల్స్ కు అడ్డుకట్ట వేయాలని.. ప్లాన్ చేశారు. ఆ వ్యక్తిని ఇంటికి రావాలని ఇన్వైట్ చేశారు. మంగళవారం మధ్యాహ్నం ఇంటికి వచ్చిన 46ఏళ్ల వ్యక్తికి.. ఆమెకు మధ్య తగవు జరిగింది. ఆ తర్వాత వారు అతణ్ని చెట్టుకు కట్టేశారు. కాళ్ల మీద, మొహం మీద, తలమీద, మూతి మీద కొట్టారు.




https://10tv.in/police-constable-single-handedly-busts-bike-thieves-recovers-26-royal-enfields-sold-by-thieves-for-rs-30000-each/
తీవ్రంగా గాయాలైన అతని శరీరాన్ని రైల్వే లైన్‌కు సమీపంలో విసిరేశారు. కనిపించకుండా చేసేందుకు ప్రయత్నించారు. అది చూసిన కొందరు కరామడాయ్ పోలీసులకు తెలియజేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. సెక్షన్ 302 ప్రకారం.. ధనలక్ష్మీ, ఆమె తల్లిపై కేసు ఫైల్ చేశారు పోలీసులు.