5 Years Holidays: సగం జీతంతో ఉద్యోగులకు ఐదేళ్లు సెలవులు..

మధ్యప్రదేశ్ గవర్నమెంట్ కనీవినీ ఎరుగని నిర్ణయం తీసుకుంది.ప్రభుత్వ ఉద్యోగులకు ఏకంగా ఐదేళ్ల పాటు సెలవులు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.

5 Years Holidays: సగం జీతంతో ఉద్యోగులకు ఐదేళ్లు సెలవులు..

Mp Govt

MP govt 5 years with half salary : మధ్యప్రదేశ్ గవర్నమెంట్ కనీవినీ ఎరుగని నిర్ణయం తీసుకుంది.ప్రభుత్వ ఉద్యోగులకు ఏకంగా ఐదేళ్ల పాటు సెలవులు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఇన్నేళ్లు సెలవులు ఇస్తున్నారు కదా..జీతం ఇవ్వరేమో అని అనుకోవచ్చు. కానీ జీతం ఇస్తారు.. కానీ పూర్తి జీతం కాదుగానీ..సగం జీతంతో ఐదేళ్లపాటు సెలవులు ఇవ్వాలని నిర్ణయించారు అదికారులు. అదేంటీ అన్నాళ్లు సెలవులిస్తే ఎక్కడిపనులు అక్కడ ఆగిపోతాయి కదా..ఎలా అనుకోవచ్చు. కానీ తప్పనిపరిస్థితి. కరోనా తెచ్చిన ఆర్థిక పరిస్థితుల రీత్యా..ఖర్చులు తగ్గించుకోవటానికి ఇటువంటి నిర్ణయాలు తీసుకోకతప్పలేదు. దుబారా ఎక్కడవుతుందో గమనించి దాన్ని కట్టడి చేసే యత్నంలో భాగంగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం తీసుకుంది. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమింటే కొన్ని విభాగాల్లో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే ఈ సెలవులు వర్తిస్తాయి. అత్యవసర విభాగాలైన విద్య, వైద్యం, రెవెన్యూ, పోలీస్ విభాగాలు మినహాయించి ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే వారికి ఈ ఐదేళ్లపాటు సెలవులు వర్తిస్తాయని అధికారులు తెలిపారు.

కరోనా వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతాలకుతలమైన సంగతి తెలిసిందే. సెకండే వేవ్ అల్లకల్లోలాన్ని సృష్టించింది. థర్డ్ వేవ్ వస్తోందంటున్నారు. ఇలా వేవ్‌ మీద వేవ్‌ ముంచుకొస్తూ.. జనాలను హడలెత్తించటమేకాకుండా..ఆర్థిక వ్యవస్థను కుదుటపడనీయడం లేదు. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు ఖర్చులు తగ్గించే చర్యలకు పూనుకున్నాయి. దీంట్లో భాగంగానే మధ్యప్రదేశ్ ప్రభుత్వం ముందుగానే మేలుకుని ఖర్చులు తగ్గించేపనిలో పడి ఇటువంటి నిర్ణయం తీసుకుంది.

ఈ పథకం కింద ప్రభుత్వ ఉద్యోగులకు సగం జీతంతో పెయిడ్ హాలిడేస్ ఇవ్వబోతున్నారు.మూడేళ్లనుంచి ఐదేళ్ల వరకు ప్రభుత్వ ఉద్యోగులు డ్యూటీ చేయకపోయినా..సగం జీతం తీసుకోవచ్చు. మిగతా సగం జీతం ప్రభుత్వానికి మిగులుతుందన్నమాట. దీని వల్ల ఏటా 6వేల కోట్ల రూపాయలు ఆదా అవుతాయని అధికారులు అంచనా వేశారు.

దీన్ని అమలు చేయటానికి ఆర్థిక శాఖ అధికారులు కసరత్తులు పూర్తి చేశారు. దీనికి సంబంధించి అన్ని వివరాలతో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అందజేశారు. దీనికి సీఎం గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఇమీడియట్ గా అమలులోకి తేవటానికి అధికారులు రెడీగా ఉన్నారు. మధ్యప్రదేశ్‌లో అమలు చేయాలనుకుంటున్న ఈ వినూత్న నిర్ణయం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. విదేశాల్లో ప్రభుత్వ ఉద్యోగులకు ఇటువంటి వెసులుబాటుఉంది. కానీ భారత్ లో మాత్రం సెలవులు ఇచ్చి సగం జీతం ఇవ్వడం ఇదే తొలిసారి కావటం విశేషం.

కరోనా వల్ల మధ్యప్రదేశ్ ప్రభుత్వ ఆదాయం దాదాపు పూర్తిగా పడిపోయిందనే చెప్పాలి.30శాతం ఆదాయంలో కోతపడింది. 2.53లక్షల కోట్ల రూపాయల అప్పులున్నాయి ప్రభుత్వానికి. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని గట్టెక్కించాలంటే ఇదొక్కటే మార్గమని అధికారులు భావించారు. ఓవైపు నిరర్థక ఆస్తులను అమ్మే ప్రక్రియ కూడా కొనసాగుతోంది. ఇలా ఇప్పటికే 500కోట్ల రూపాయలు సమీకరించారు. ఇటువంటి పరిస్థితుల్లో అధికారులు పలురకాలుగా కసరత్తులు చేసి ఇలా చేస్తే ప్రభుత్వానికి ఎంత మిగల్చవచ్చు..అని ఆలోచించి అన్ని వివరాలతో సీఎంకు అందజేశారు. మరి సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.