జైలుకి పంపిన యువతిపై పగ : బెయిల్ పై వచ్చి 30సార్లు పొడిచి చంపేశాడు

  • Published By: veegamteam ,Published On : December 3, 2019 / 10:17 AM IST
జైలుకి పంపిన యువతిపై పగ : బెయిల్ పై వచ్చి 30సార్లు పొడిచి చంపేశాడు

మధ్యప్రదేశ్‌ జబల్‌పూర్‌ జిల్లాలో దారుణం జరిగింది. 17 ఏళ్ల యువతిపై సెప్టెంబర్‌లో 19 ఏళ్ల యువకుడు శివకుమార్ అత్యాచారానికి యత్నించాడు.బాధితురాలి కుటుంబ సభ్యులు అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా..విచారణ జరిపిన పోలీసులు యువకుడిని అరెస్ట్ చేయటం..కేసు విచారణ..అనంతరం జైలుకు పంపించారు. ఈ క్రమంలో పది రోజుల క్రితం యువకుడు బెయిల్‌పై విడుదలయ్యాడు. తాను జైలుకు వెళ్లటానికి కారణమైన యువతిపై పగబట్టాడు. ఆమెను ఎలాగైనా చంపేయాలనుకున్నాడు. దాని కోసం ఓ కత్తి కూడా కొన్నాడు. అదను కోసం ఆమె ఇంటి ముందు ఎవ్వరికీ తెలీకుండా మూడు రోజుల పాటు కాపు కాసాడు. 

సోమవారం (డిసెంబర్ 2)న ఆమె తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయం చూసి కత్తి పట్టుకుని ఇంట్లోకి వెళ్లాడు. ఆమెపై విచక్షణారహితంగా 30 కత్తిపోట్లు పొడిచి దారుణంగా చంపేశాడు. కత్తిపోట్లు భరించలేని బాధితురాలు గిలిగిలలాడిపోతు గట్టిగా కేకలు వేసింది. ఆ కేకుల విన్న ఇరుగుపొరుగు వారు గబగబా వచ్చారు. రక్తపు మడుగులో కొట్టుకుంటున్న ఆమెను చూశారు. వారిని చూసి పారిపోవటానికి యత్నించిన శివకుమార్ ను స్థానికులు పట్టుకుని తిరగి పోలీసులకు అప్పగించారు. బాధితురాలిని వెంటనే హాస్పిటల్ కు తరలించారు. అప్పటికే ఆమెకు తీవ్ర రక్తస్రావం అయి చనిపోయిందని డాక్టర్లు చెప్పారు. 

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఒకే యువతి గురించి రెండు కేసుల్లో ఇరుక్కున్న శివకుమార్ ను పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించారు. ఈ దారుణంపై గోపాల్పూర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ప్రవీణ్ ధ్రువ్ మాట్లాడుతూ…. ప్రతీకారం తీర్చుకోవాలనే ఆ యువతిని చంపేశానని పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడని తెలిపారు.