దేవుడి కోసం భార్య తలను నరికాడు..పూజ గదిలో పాతిపెట్టాడు

  • Published By: madhu ,Published On : September 4, 2020 / 08:15 AM IST
దేవుడి కోసం భార్య తలను నరికాడు..పూజ గదిలో పాతిపెట్టాడు

దేవుడిని సంతోష పెట్టాలని ఓ భర్త..భార్యను తలను నరికాడు..పూజ గదిలో పాతిపెట్టాడు. దేవతను ప్రసన్నం కోసం భార్యను అత్యంత దారుణంగా చంపేశాడు. తల, మొండం వేరు చేసి పూజ గదిలో పాతిపెట్టాడు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బసౌడా గ్రామంలో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. నిందితుడు (50) పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు.



గురువారం ఉదయం లేచిన ఇద్దరు కుమారులకు తల్లి కనిపించకపోవడంతో ఇంట్లో వెతికారు. పూజ గదిలో తల్లి విగతజీవిగా పడి ఉండడాన్ని తల, మొండి వేరుగా ఉండడంతో షాక్ తిన్నారు. వెంటనే ఈ సమాచారాన్ని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనాస్థలికి వారు చేరుకున్నారు.
https://10tv.in/where-top-maoist-leader-ganapathy/
తండ్రి కనిపించకపోవడంతో అతనే చంపేశాడని పోలీసులు భావించారు. దేవతను సంతోష పెట్టాలని భావించి..తన తండ్రి చంపేశాడని కుమారులు తెలిపారు. గతంలో ఓ మేకను చంపాడని తెలిపారు.