ఢిల్లీ 5స్టార్ హోటళ్లో ఈవెంట్ మేనేజర్‌పై రేప్

ఢిల్లీ 5స్టార్ హోటళ్లో ఈవెంట్ మేనేజర్‌పై రేప్

Delhi:ముంబైకు చెందిన ఈవెంట్ మేనేజర్‌ ఢిల్లీలోని 5స్టార్ హోటల్ లో రేప్ కు గురైంది. నవంబర్ 21న జరిగిన ఘటనలో ఇద్దరు ఢాబా ఓనర్లను పోలీసులు అరెస్టు చేశారు. మిక్కీ మెహతా (57), నవీన్ ద్వార్ (46)లు ఢిల్లీలోని లజ్‌పత్ నగర్, సాకేత్ ప్రాంతాలలో ఉంటున్నారు.

ఆ రెస్టారెంట్ హర్యానాలోని సోనీపట్ దగ్గర్లో ఉంటుంది. ఈ 27ఏళ్ల మహిళ మెహతాను, ద్వార్ ను ఫేస్ బుక్ ద్వారా నవంబర్ 18, 19న కలిసినట్లు చెప్పింది. అటువైపుగా వెళ్తున్న సమయంలో ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు సమీప ప్రాంతంలో ఉండే హోటల్ దగ్గరకు వచ్చేసరికి ద్వార్ ఆమెతో తప్పుగా ప్రవర్తించాడు.



ఆ తర్వాత ఆమెను హోటల్ బయటే మెహతాతో పాటు విడిచిపెట్టి వెళ్లిపోయాడు. హోటల్ గదిలో మెహతా ఆమెపై రేప్ కు పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆమెను ఆనంద్ విహార్ ప్రాంతానికి తీసుకెళ్లి వదిలేశాడు. వారిద్దరినీ జ్యూడిషియల్ కస్టడీకి అప్పగించినట్లు పోలీసులు చెప్పారు.
https://10tv.in/india-pak-bangladesh-should-be-merged-maharashtra-minister-to-bjp/
ఢిల్లీ రిపోర్టుల ప్రకారం.. చూస్తే ప్రతి రోజూ ఆరుగురు మహిళలు రేప్ కు గురవుతున్నారు. ఢిల్లీలో నమోదవుతున్న రేప్ నిందితుల్లో 98శాతం క్లోజ్ బంధువులు కానీ, సన్నిహితులు గానీ ఉంటున్నారు. నవంబర్ 18న పార్లమెంటరీ ప్యానెల్ తో మాట్లాడిన ఢిల్లీ పోలీసులు.. 44శాతం కేసుల్లో బాధితులు కుటుంబంలో వారు లేదా కుటుంబ స్నేహితులు ఉన్నారు. బంధువుల వల్ల 13శాతం, పొరుగువారి వల్ల 12శాతం మంది ఉన్నారు.