Mumbai : సోదరుడు హత్యాయత్నం .. మెడలో దిగిన కత్తితో బైక్ డ్రైవ్ చేస్తు ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తి

హత్యా యత్నం నుంచి తప్పించుకున మెడలో దిగబడిన కత్తితోనే సొంతంగా బైక్ నడుపుకుంటు ఆస్పత్రికి వెళ్లి ప్రాణాలతో బతికి బయటపడ్డాడు ఓ వ్యక్తి.

Mumbai  : సోదరుడు హత్యాయత్నం .. మెడలో దిగిన కత్తితో బైక్ డ్రైవ్ చేస్తు ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తి

Mumbai Man murder Attempted On brother: ముంబైలో ఓ షాకింగ్ ఘటన జరిగింది. ముంబైకు చెందిన తేజస్‌ పాటిల్‌ అనే వ్యాపారవేత్తపై తన సొంత సోదరుడే కత్తితో దాడికి తెగబడ్డాడు. జూన్ 3న తేజస్ నిద్రపోతుండగా అతని సోదరుడు కత్తితో దాడి చేశాడు. ఆ దాడిలో తేజస్ కత్తి మెడలో దిగిపోయింది. రక్తం కారుతోంది. దీంతో సోదరుడి దాడి నుంచి తప్పించుకున్న తేజస్ పార్క్ చేసిన ఉన్న బైక్ పై ఆస్పత్రికి బయలుదేరాడు. కత్తి మెడలో దిగబడి ఉంది. రక్తం కారుతుండగానే బైక్ పై తానే కిలోమీటరు సొంతగా డ్రైవ్ చేసుకుంటే ఆస్పత్రికి చేరుకుని మరీ వైద్యం చేయించుకున్నాడు.

నవీ ముంబయిలోని సాన్‌పాడా సెక్టార్‌ 5లో నివసించే తేజస్‌ పాటిల్ నివసిస్తుంటారు. అతని వయస్సు 30 ఏళ్లు. జూన్‌ 3వ తేదీ రాత్రి తన ఇంట్లో నిద్రపోతున్నాడు. అదే సయమంలో అతని సోదరు మోనీశ్ మరో వ్యక్తితో కలిసి అన్నపై దాడి చేశాడు. హత్యయత్నంలో భాగంగా తేజస్ పై దాడి చేసి మెడపై పొడిచాడు. దీంతో తేజస్ పెద్ద పెద్దగా కేకలు వేశాడు. మరోసారి మోనీశ్ దాడి చేయబోతుండగా తప్పించుకున్నాడు. మరోసారి పెద్దగా కేకలు వేశాడు.

 

దీంతో మోనీశ్ తో పాటు మరో వ్యక్తి పారిపోయాడు. మెడలో దిగిపోయిన కత్తితోనే తీవ్రమైన నొప్పి భరిస్తూ అలాగే బైక్ తీసుకుని సొంతగా డ్రైవ్ చేస్తు ఎంపీసీటీ ఆసుపత్రికి చేరుకున్నాడు. అతని పరిస్థితి చూసిన డాక్టర్లు నాలుగు గంటలపాటు శస్త్రచికిత్స చేసి కత్తిని తొలగించారు. మెడపై కత్తిదాడి జరిగినా.. రక్తనాళాలు దెబ్బతినకపోవటంత తేజస్ కు ప్రాణాపాయం తప్పింది అని డాక్టర్లు తెలిపారు. తరువాత సోమవారం వార్డుకు తరలించారు. రెండు మూడు రోజుల్లో తేజస్ ను డిశార్జ్ చేస్తామని తెలిపారు.

 

అనంతరం తేజస్ తనపై జరిగిన దాడి గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన సోదరుడు మద్యానికి బానిస అయ్యాడని..తుర్భే నుంచి మహేశ్ అనే స్నేహితుడితో కలిసి వచ్చి ఇద్దరు తనపై దాడి చేశారని తెలిపారు. కేసు నమోదు చేసుకుని పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.