Mumbai: ఫోన్ పక్కకుపెట్టి జాబ్ వెదుక్కోమని చెప్పిందని వదిన హత్య

వదినను చంపడమే కాకుండా సూసైడ్ చేసుకున్నట్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడొక టీనేజర్. ఫోన్ లో గేమ్స్ ఆడటం మానేసి ఏదైనా ఉద్యోగం వెదుక్కోమని సూచించడంతో ఇలా చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతి చెందిన తర్వాత ఎలుకల మందును గొంతులో పోసి పోలీసులకు ఆత్మహత్య చేసుకుందంటూ సమాచారం ఇచ్చాడు.

Mumbai: ఫోన్ పక్కకుపెట్టి జాబ్ వెదుక్కోమని చెప్పిందని వదిన హత్య

Ex-Bihar MLA

Mumbai: వదినను చంపడమే కాకుండా సూసైడ్ చేసుకున్నట్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడొక టీనేజర్. ఫోన్ లో గేమ్స్ ఆడటం మానేసి ఏదైనా ఉద్యోగం వెదుక్కోమని సూచించడంతో ఇలా చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతి చెందిన తర్వాత ఎలుకల మందును గొంతులో పోసి పోలీసులకు ఆత్మహత్య చేసుకుందంటూ సమాచారం ఇచ్చాడు.

ఇర్షాద్ ఆలం అనే నిందితుడు ఎలుకల మందిచ్చి సాహిబా (25) అనే యువతిని హత్య చేసినట్లు పోలీసులు కన్ఫామ్ చేశారు.

ముందుగా యాక్సిడెంటల్ డెత్ కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు డెడ్ బాడీని అటాప్సీకి పంపారు. మంగళవారం వచ్చిన పోస్టుమార్టం రిపోర్టులో ఎలుకల మందు కడుపులోకి వెళ్లలేదనే సంగతి గుర్తించారు. ఆ తర్వాత ఆమె మెడపై బలవంతంగా నొక్కినట్లుగా ఉన్న గుర్తులు చూసి హత్య చేసినట్లు నిర్ధారించారు.

Read Also : ముంబైలో కూలిన నాలుగు అంతస్తుల భవనం..ఒకరు మృతి

స్టేషన్ కు పిలిచి విచారించగా ఆలం నేరాన్ని అంగీకరించాడు. తన అన్న జుబేర్‌ను వివాహం చేసుకున్న సాహిబా తాను ఫోన్ తో గేమ్స్ ఆడుకుంటున్న ప్రతిసారి ఏదో ఒకటి తిడుతూ ఉండేదని… ఇంటి ఖర్చుల కోసం ఏదైనా పని చేయాలని చెప్తూ ఉండేదని పోలీసులతో అన్నాడు.

శుక్రవారం కూడా ఇదే విషయంలో వాదనకు దిగిందని అలా జరిగిన గొడవతో శనివారం ఎవరూ లేని సమయంలో హత్య చేయాలని ప్లాన్ చేసినట్లు వివరించాడు. వంట గదిలో ఒంటరిగా పనిచేసుకుంటుండగా గుడ్డతో గొంతునొక్కేశాడు. చనిపోయిన తర్వాత జేబులో ఉన్న ఎలుకల మందు తీసుకుని గొంతులో పోశాడు.

ఘటన జరిగిన సమయంలో జుబేర్ రోజువారీ పనుల నిమిత్తం బయటకు వెళ్లాడు.