మహిళను ఈడ్చుకొచ్చి వివస్త్రను చేసి ఊరేగించారు..ఫిర్యాదు చేసిన పట్టించుకోని పోలీసులు

  • Published By: nagamani ,Published On : July 15, 2020 / 09:07 AM IST
మహిళను ఈడ్చుకొచ్చి వివస్త్రను చేసి ఊరేగించారు..ఫిర్యాదు చేసిన పట్టించుకోని పోలీసులు

Muzaffarpur Woman stripped, nude thrashed బీహార్ లో సభ్యసమాజం సిగ్గుతో తలవంచుకునే దారుణం జరిగింది. ఓ మహిళను ఇంట్లో నుంచి జుట్టుపట్టి బైటకు ఈడ్చొకిచ్చి ఈడ్చుకొచ్చారు. నడిరోడ్డుపై నిలబెట్టి ఇష్టమొచ్చినట్లుగా చావబాదారు. ఆమెను వివస్త్రను చేసివీధుల్లో నగ్నంగా ఊరేగించారు. ఈ దారుణాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆ దారుణ ఘటనపై పోలీసులు కూడా పట్టించుకోకపోవటం గమనించాల్సిన విషయం.

వివరాల్లోకి వెళితే..ముజఫ్ఫర్‌పూర్‌ ఆంధ్రతాడి గ్రామంలో ఓ మహిళకు ఓ అంగన్‌వాడీ కార్యకర్త అయిన లీలా దేవికి మద్య గొడవ జరిగింది. ఈ గొడవలో అంగన్‌వాడీ భర్త మోతీ మెహతో జోక్యం చేసుకుని ఇద్దరూ కలసి సదరు మహిళ ఇంటికెళ్లి చెప్పటానికి వీలు కాని విధంగా అశ్లీలంగా దూషించారు.
దీంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురై పోలీసులతో మొరపెట్టుకుంది.లీలాదేవి..ఆమె భర్తపై ఫిర్యాదు చేసింది. ఇది తెలుసుకుని లీలా దేవి, ఆమె భర్త మోతీ కోపంతో రగిలిపోయారు.

మా పైనే పోలీసులకు ఫిర్యాదు చేస్తావా అంటూ మాయమాటలు చెప్పి గ్రామస్తులను పోగుచేశారు. ఆమె ఇంటిపై దాడి చేశారు. ఇంటి నుంచి బయటికి జుట్టు పట్టుకుని ఈడ్చుకొచ్చి నడివీధిలో పడేశారు. ఇష్టమొచ్చినట్లుగా దూషిస్తూ చితకబాదారు. వారి దుర్మార్గం అక్కడితో ఆగలేదు.ఆమెను పూర్తిగా వివస్త్రను చేశారు. నడివీధుల్లో నగ్నంగా తిప్పారు. ఈ దారుణాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసి పైశాచికానందం పొందారు.

తనపై జరిగిన ఈ దారుణంతో సిగ్గుతో చితికిపోయిందామె.కానీ ధైర్యాన్ని కోల్పోలేదు. భరించింది. మనస్సు చిక్కబట్టుకుని అవమానాన్ని దిగమింగి న్యాయం కోసం పోలీస్ స్టేషన్‌కి వెళ్లి..తనకు జరిగిన దారుణం గురించి చెప్పింది. కానీ అక్కడ కూడా ఆమెకు న్యాయం జరగలేదు. ఆమె ఫిర్యాదును పోలీసులు తీసుకోలేదు.
తనను చావబాది నగ్నంగా ఊళ్లో తిప్పిన వారిపై ఫిర్యాదు చేస్తే పోలీసులు కూడా పట్టించుకోవటం లేదనీ..ఇక తనకు న్యాయం ఎక్కడ జరుగుతుందని వాపోతూ భోరున ఏడ్చింది ఆ బాదితురాలు.తనపై 13 మంది తనపై దాడి చేశారని బాధితురాలు ఆరోపించింది. కేసు నమోదు చేస్తారా? లేదా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.