పిచ్చి పీక్స్ : పెళ్లి విందులో రైఫిళ్లతో వధూవరుల ఫోజులు 

  • Published By: veegamteam ,Published On : November 12, 2019 / 06:46 AM IST
పిచ్చి పీక్స్ : పెళ్లి విందులో రైఫిళ్లతో వధూవరుల ఫోజులు 

పెళ్లిళ్ల విందుల్లో తుపాకులతో ఫోజులివ్వటం..ఊరేగింపుల్లో కాల్పులు జరపటం ఫ్యాషన్ గా మారిపోయింది. నాగాలాండ్‌కు చెందిన రెబల్ నాయకుడి కుమారుడి వివాహ విందులో పెళ్లి కూతురు..పెళ్లి కొడుకులు మరో ముందడుగు వేశారు. చిన్న చిన్న తుపాకులు మా రేంజ్ కు సరిపోవనుకున్నారో ఏమో..ఏకంగా లేటెస్ట్ టెక్నాలజీ కలిగిన రైఫిళ్లు పట్టుకుని ఫోటోలకు ఫోజులిచ్చారు. 

నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ యునిఫికేషన్ రెబల్ సంస్థ నాయకుడు భోహోటో కిబా కుమారుడి వివాహ విందు నాగాలాండ్ వాణిజ్య కేంద్రమైన దిమాపూర్ లో భోహోటో కిబా కొడుకు రిసెప్షన్ జరిగింది. ఈ రిసెప్షన్ లో పెళ్లి కూతురుతో కలిసి పెళ్లి కొడుకు ఏకే 56, ఎం 16 ఆటోమేటిక్ రైఫిళ్లు చేతబట్టుకొని ఫోటోకు ఫోజు ఇచ్చారు. వధూవరులు రైఫిళ్లు పట్టుకున్న ఫోటోను షోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది కాస్తా వైరల్ గా మారింది. 

కేంద్రం నాగాలాండ్ గ్రూపులతో శాంతి స్థాపన కోసం చర్చలు జరుపుతున్న తరుణంలో ఈ నెల 9వతేదీన జరిగిన రెబల్ నాయకుడి కుమారుడి రిసెప్షన్ లో పెళ్లి కొడుకు..పెళ్లి కూతురు ఇలా రైఫిళ్లతో ఫోజు ఇవ్వడం వివాదాస్పదంగా మారింది.